close
Choose your channels

రాజ్‌త‌రుణ్ హీరోగా శాంటో ద‌ర్శ‌క‌త్వంలో డ్రీమ్ టౌన్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్ చిత్రం ప్రారంభం

Tuesday, November 3, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రాజ్‌త‌రుణ్ హీరోగా శాంటో ద‌ర్శ‌క‌త్వంలో డ్రీమ్ టౌన్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్ చిత్రం ప్రారంభం

యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్ హీరోగా శాంటో ద‌ర్శ‌క‌త్వంలో కొత్త చిత్రం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. డ్రీమ్ టౌన్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్‌పై నంద్‌కుమార్ అభినేని, భ‌ర‌త్ మ‌గులూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వ‌ర్షా బొల్ల‌మ్మ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సంద‌ర్భంగా...

నిర్మాత‌లు నంద్‌కుమార్ అభినేని, భ‌ర‌త్ మ‌గులూరి మాట్లాడుతూ - ``రాజ్‌త‌రుణ్‌గారితో మా బ్యాన‌ర్‌లో సినిమా చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. డైరెక్ట‌ర్ శాంటో చెప్పిన క‌థ న‌చ్చింది. అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా సినిమాను రూపొందిస్తాం. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం. ఆ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం`` అన్నారు.

రాజ్‌త‌రుణ్ హీరోగా శాంటో ద‌ర్శ‌క‌త్వంలో డ్రీమ్ టౌన్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్ చిత్రం ప్రారంభం

ద‌ర్శ‌కుడు శాంటో మాట్లాడుతూ - ``రాజ్‌త‌రుణ్ హీరోగా న‌టిస్తున్న 15వ సినిమా ఇది. ఆయ‌న్ని కొత్త యాంగిల్‌లో ప్రెజంట్ చేస్తూ అంద‌రినీ ఆక‌ట్టుకునే ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌లా సినిమా ఉంటుంది. నిర్మాత‌ల‌కు థాంక్స్‌. త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ‌తాం`` అన్నారు.

న‌టీన‌టులు: రాజ్‌త‌రుణ్‌, వ‌ర్షా బొల్ల‌మ్మ‌, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.