'నమ్మేలా లేదే' అంటున్న 'రాజావారు రాణిగారు'

  • IndiaGlitz, [Thursday,August 22 2019]

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా లో బాగా హైలైట్ అయిన పేరు 'రాజావారు రాణిగారు'.పోస్టర్లతో టీజర్ తో జనాలలో మంచి ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం గతవారమే మొదటి పాట ద్వారా ప్రజలకు మరింత చేరువైంది.రాజావారు రాణిగారు టైటిల్ సాంగ్ కు విశేషమైన స్పందన రావడంతో చిత్రబృందం ఈ సినిమా లోని రెండో పాటని కూడా విడుదల చేసారు.

జయ్ క్రిష్ సంగీత సారథ్యంలో రూపొందిన 'నమ్మేలా లేదే ..' అనే ఈ మెలోడీ కి కూడా నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది.ముఖ్యంగా యూత్ ఈ పాటకి కనెక్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అనురాగ్ కులకర్ణి గాత్రం ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. 'నమ్మేలా లేదే..కల కాదే.. మనసే మేఘమాయే' అంటూ సాగే ఈ పాట సాహిత్యపరంగా కూడా చాలా బావుండటం కలిసొచ్చే అంశం.

ఈ చిత్రంతో కిరణ్ అబ్బవరం,రహస్య గోరఖ్ లు హీరో హీరోయిన్స్ గా పరిచయం అవుతున్నారు.
ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తుండగా, ఎస్ ఎల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మనోవికాస్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

More News

`సాహో` సెన్సార్ పూర్తి..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధాకపూర్ హీరో హీరోయిన్‌గా రూపొందిన భారీ యాక్షన్ చిత్రం ‘సాహో’. సుజిత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన దివ్యవాణి

టాలీవుడ్ సీనియర్ నటి, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి ఆ పార్టీకి టాటా చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకోబోతోందని గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.

తిరుగులేని శక్తిగా మారిన బీజేపీ!!

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తిరుగులేని శక్తిగా మారింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ మరింత బలపడిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

‘విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాగే చిదంబరం కూడా..!’

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత పీ చిదంబరానికి సుప్రీం కోర్టులో ఊరట లభించలేదన్న విషయం విదితమే.

'ఉండి పోరాదే' సెన్సార్ పూర్తి, ఆగష్టు 31న రిలీజ్

గోల్డ్ టైమ్ ఇన్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి సత్య ప్రమీల కర్లపూడి సమర్పణలో డాక్టర్ లింగేశ్వర్ నిర్మాతగా నవీన్ నాయని దర్శకత్వంలో