రాజమౌళికి 'లై' నచ్చలేదా?

  • IndiaGlitz, [Saturday,August 12 2017]

ద‌ర్శ‌క‌మౌళి రాజ‌మౌళి అంద‌రివాడు. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వ‌ర‌కు, త‌న నుంచి ఇవ్వ‌వ‌ల‌సిన స‌పోర్ట్‌ని ఇస్తూ... తోటివారిని ప్రోత్స‌హిస్తుంటాడు. అలాగే త‌ను ఏదైనా సినిమాని చూస్తే.. దాని మీద త‌న అభిప్రాయాన్ని ట్విట్ట‌ర్ సాక్షిగా త‌న మార్క్ రివ్యూగా నాలుగు ముక్క‌ల్లో విశ్లేషిస్తుంటాడు. అయితే గ‌త నెల‌రోజులుగా రాజ‌మౌళి నుంచి వ‌చ్చిన ట్వీట్ల‌ని ప‌రిశీలిస్తే.. అవి రెండు సినిమాల గురించి మాత్ర‌మే ఉన్నాయి త‌ప్ప మ‌రే విష‌యం మీద కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఆ రెండు చిత్రాలు ప‌టేల్ స‌ర్, నేనే రాజు నేనే మంత్రి. ఈ రెండింటి గురించి పాజిటివ్‌గా స్పందించి ఆయా సినిమాల‌కి త‌న వంతు స‌పోర్ట్ చేశాడు.
అయితే ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే... రాజ‌మౌళి నిన్న ఉద‌యం 8.45గం|| షోగా ప్ర‌సాద్ ఐమ్యాక్స్‌లో లై సినిమాని త‌న కుటుంబ స‌భ్యులు కీర‌వాణి, శ్రీ‌వ‌ల్లి, రమా రాజ‌మౌళితో వీక్షించాడు. అయితే ఆ త‌రువాత షోగా నేనే రాజు నేనే మంత్రిని చూసిన రాజ‌మౌళి ఆ సినిమాపై వెంట‌నే స్పందించాడు. మ‌రి లై రాజ‌మౌళికి న‌చ్చ‌లేదో లేక మ‌రొటో తెలియ‌దు గానీ ఇంత‌వ‌ర‌కు స్పందించ‌లేదు. మైండ్ గేమ్ కాన్సెప్ట్‌తో టెక్నీక‌ల్ గా హై స్టాండ‌ర్డ్స్‌తో తెర‌కెక్కిన లై టార్గెట్ ఆడియ‌న్స్ కి బాగానే క‌నెక్ట్ అయింది.

More News

జోష్ బాటలో యుద్ధం శరణం..

రారండోయ్ వేడుక చూద్దాంతో ఈ ఏడాది ప్రథమార్థంలో తన ఖాతాలో మరో హిట్నిజమ చేసుకున్నాడు నాగ చైతన్య.

'ప్రాజెక్ట్ z' సెన్సార్ పూర్తి..సెప్టెంబర్ ప్రథమార్థంలో విడుదల

సందీప్ కిషన్,లావణ్య త్రిపాటి,జాకీష్రాఫ్ ప్రధాన పాత్రల్లో సి.వి.కుమార్ దర్శకత్వంలో తమిళ్లో తెరకెక్కిన 'మాయావన్'

నిత్యా మీనన్..ఎన్నాళ్లెన్నాళ్లకు..

పెర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రల్లోనే కనిపించడానికి ఇష్టపడే కథానాయిక నిత్యా మీనన్

శోభన్ తో తల్వార్...

రాజా చెయ్యి వేస్తేచిత్రంలో నటించిన ఇషా తల్వార్ మళ్లీ తెలుగు సినిమాల్లో నటించలేదు.

తల్లి పాత్రలో మీనా...

బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన మీనా తర్వాత స్టార్ హీరోలందరితో ఆడిపాడింది.