అడ‌వుల్లో రాజ‌మౌళికి ఏం ప‌ని?

లాక్‌డౌన్ స‌మ‌యంలో దాదాపు ఇల్లు, ఫాంహౌస్‌కే ప‌రిమిత‌మైన ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి, కీర‌వాణి కుటుంబ స‌భ్యుల్లో కొంద‌రికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే వారు ఆరోగ్యాన్ని బాగు చేసుకుని క‌రోనా వారియ‌ర్స్‌గా రిట‌ర్న్ బ్యాక్ అయ్యారు. ఇప్పుడిప్పుడు రాజ‌మౌళి ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకుని ఓ చిన్న బ్రేక్ తీసుకున్నారు. సినిమాలు, ఇత‌ర ఆలోచ‌న‌ల‌కు దూరంగా చిన్న ట్రిప్ ప్లాన్ చేశారు. అది కూడా మ‌న ప‌క్క రాష్ట్ర‌మైన క‌ర్ణాట‌క అడ‌వుల్లో కావ‌డం విశేషం. ఈ మ‌ధ్య మ‌న సెల‌బ్రిటీలంద‌రూ విరామం కావాల‌నుకున్న‌ప్పుడు అడ‌వి బాట ప‌డుతున్నారు. ఆ మ‌ధ్య త‌మ‌న్నా ప‌చ్చ‌ద‌నంలో తాను ట్రావెల్ చేశాన‌ని చెప్పిన సంగ‌తి తెల‌సిందే. అలాగే రీసెంట్‌గా బ‌న్నీ కూడా ఆదిలాబాద్ కుంటాల జ‌ల‌పాతంను కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వీక్షించాడు. ఇప్పుడు వీరి బాట‌లో జ‌క్క‌న్న కూడా అడవుల బాట ప‌ట్టారు.

వివ‌రాల్లోకెళ్తే భార్య ర‌మా రాజ‌మౌళితో క‌లిసి రాజ‌మౌళి.. క‌ర్ణాట‌క‌లోని బందీపూర్ టైగ‌ర్ ఫారెస్ట్‌ను సంద‌ర్శించారు. అట‌వీశాఖ సంర‌క్ష‌ణాధికారుల సాయంతో అక్క‌డే ఓ రిసార్ట్‌లో వారు స్టే చేశారు. అలాగే ఫారెస్ట్ అధికారుల వాహ‌నంలోనే అడ‌విలోకి వెళితే వారికి పులులేవీ క‌నిపించ‌లేద‌ని, ఏనుగులు కొన్ని ఇత‌ర జంతువులు మాత్ర‌మే క‌నిపించాయ‌ట‌. ఈ రిజ‌ర్వ్ ఫారెస్ట్‌లోకి వెళ్ల‌డానికి ముందు అక్క‌డికి ద‌గ్గ‌ర‌లోని హిమ‌వ‌ద్ గోపాల‌స్వామి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఆ ఫొటోలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

More News

నిర్మాత‌ల‌కు ‘వ‌కీల్‌సాబ్’ కండీష‌న్స్‌..!

జనసేనాని, పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత న‌టిస్తోన్న తొలి చిత్రం ‘వ‌కీల్‌సాబ్‌’.

సూప‌ర్‌స్టార్‌తో త‌ల‌ప‌డ‌నున్న మ‌రో బాలీవుడ్ స్టార్!

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ సినిమాల్లో ఈ మ‌ధ్య ఎక్కువ‌గా మెయిన్ విల‌న్‌గా బాలీవుడ్ స్టార్సే న‌టిస్తూ వ‌స్తున్నారు.

షాకింగ్.. గంగవ్వకు అనారోగ్యం.. హౌస్‌లో ఉండలేనంటూ ఆవేదన

బిగ్‌బాస్ షోలోకి ఇవాళ ముక్కు అవినాష్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. షాకింగ్‌గా గంగవ్వ అనారోగ్యం పాలైంది.

శ్రావణిని దారుణంగా వేధించిన ‘ఆర్ఎక్స్ 100’ నిర్మాత

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఇప్పటి వరకూ దేవరాజ్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డి అకృత్యాలు మాత్రమే తెలిశాయి.

లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో మోడీ బయోపిక్ 'మనో విరాగి'

గౌరవనీయులైన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా 'మనో విరాగి'.