రజనీకాంత్ టార్గెట్ 2021
Send us your feedback to audioarticles@vaarta.com
క్రియాశీలక రాజకీయాల్లోకి సూపర్స్టార్ రజనీకాంత్ ప్రవేశం ఇక లాంచనమే. ఇలాంటి తరుణంలో లోక్సభ ఎన్నికలు సమీపించాయి. మరి ఈ ఎన్నికల్లో రజనీ పార్టీ రజనీ మక్కల్ మండ్రం పోటీ చేస్తుందా? అనే ప్రశ్న నెలకొంది. దీనిపై జిల్లా కార్యదర్శుల సమావేశంలో రజనీకాంత్ క్లారిటీ ఇచ్చారు. తమ టార్గెట్ 2021లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే అన్నారు.
అంతే కాకుండా ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. సరికదా! ఎవరికీ మద్ధతు కూడా ప్రకటించడం లేదంటూ తేల్చేశారు. తన పార్టీ గుర్తుని కానీ.. తన ఫోటోను, పేరుని కానీ ఎవరూ వాడుకోవద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా అలా చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటానని కూడా తెలిపారు. ఈ ఎన్నికల్లో తమిళనాడులో నీటి సమస్యను తీరుస్తానని మాట ఇచ్చేవారికే ఓటు వేయాలని సూచించారు కూడా.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.