హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న రాజ‌శేఖ‌ర్ కుమార్తె..!

  • IndiaGlitz, [Thursday,September 15 2016]

డా.రాజ‌శేఖ‌ర్ - జీవిత దంప‌తుల కుమార్తె శివాని ఎంట్రీ గురించి గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. రాజ‌శేఖ‌ర్ తండ్రిగా శివాని కుమార్తెగా ఓ సినిమా అనుకున్నారు కానీ ఎందుక‌నో ఈ ప్రాజెక్ట్ తెర పైకి రాలేదు. అయితే...ఇప్పుడు శివానిని హీరోయిన్ గా ప‌రిచ‌యం చేసేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. నాగ‌శౌర్య హీరోగా వైవిధ్యంగా ఉండే థ్రిల్ల‌ర్ ను నూత‌న ద‌ర్శ‌కుడితో తెర‌కెక్కించేందుకు ప్లాన్ జ‌రుగుతుంద‌ట‌.

ఈ చిత్రాన్ని వారాహి చ‌ల‌న‌చిత్ర బ్యాన‌ర్ పై సాయి కొర్ర‌పాటి నిర్మించ‌నున్నారు. పెద్ద‌గా హ‌డావిడి లేకుండా మిడియ‌మ్ బ‌డ్జెట్ మూవీ అయిన‌ ఈ చిత్రం ద్వారా శివానిని హీరోయిన్ గా ప‌రిచ‌యం చేయాల‌నుకుంటున్నార‌ట రాజ‌శేఖ‌ర్ జీవిత‌. మ‌రి...ఇదే క‌నుక నిజ‌మైతే శివాని న‌టిగా ఎంత వ‌ర‌కు రాణిస్తుందో చూడాలి..!

More News

క్రిస్మస్ క్యూ క‌డుతున్న సినిమాలు ఇవే..!

ద‌స‌రాకి ఓ నాలుగైదు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు క్రిస్మ‌స్ కానుక‌గా సినిమాలు రిలీజ్ చేసేందుకు పోటీప‌డుతున్నారు నిర్మాత‌లు.

చైతు...రెండు సినిమాలు ఒకేసారి

అక్కినేని నాగచైతన్య రెండు సినిమాలు సాహసం శ్వాసగా, ప్రేమమ్ సినిమాలు విడుదలకు సిద్ధమైయ్యాయి. ఇవి విడుదలక కాకమునుపే చైతన్య మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.

టిప్పు మూడో ప్రయత్నం

`టిప్పు`, `పడేసావే` చిత్రాల హీరో కార్తీక్ రాజు ఇప్పుడు మరో సినిమా  చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. తొలి రెండు చిత్రాలతో అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేక పోయిన ఈ యువ హీరో మూడోసారి ఓ లవ్ ఎంటర్ ను చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడట.

నాలోని ద‌ర్శ‌కుడిని నాకు ప‌రిచ‌యం చేసింది క‌ళ్యాణ్ గారే - సిద్దార్ధ డైరెక్ట‌ర్ ద‌యానంద‌రెడ్డి

సాగ‌ర్, రాగిణి, సాక్షి చౌద‌రి హీరో, హీరోయిన్స్ గా ద‌యానంద‌రెడ్డి తెర‌కెక్కించిన చిత్రం సిద్దార్ధ‌. ఈ చిత్రాన్ని రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దాస‌రి కిర‌ణ్ కుమార్ నిర్మించారు.

దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ కి హీరోయిన్ దొరికేసింది..!

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న‌ తాజా చిత్రం దువ్వాడ జ‌గ‌న్నాథమ్. ఈ చిత్రాన్ని హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.