కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన హీరో రాజశేఖర్

  • IndiaGlitz, [Monday,November 09 2020]

ఇటీవల కరోనా బారిన పడిన హీరో రాజశేఖర్ నేడు డిశ్చార్జ్ అయ్యారు. గత కొద్ది రోజులుగా ఆయన కరోనాకు హైదరాబాద్‌లోని సిటీ న్యూరో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుట పడటంతో సోమవారం వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారు. ఉదయం రాజశేఖర్‌ కుమార్తె శివాత్మిక ''నాన్నగారి ఆరోగ్యం స్లోగా మెరుగవుతోంది.. కచ్చితంగా ఆయన కోలుకుంటారు. నాన్న కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు' అని ట్విట్టర్ వేదికగా తెలిపింది.

శివాత్మిక ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే రాజశేఖర్ డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సిటి న్యూరో సెంటర్‌ సిబ్బందికి, డాక్టర్‌ కృష్ణకు జీవిత ధన్యవాదాలు తెలిపారు. నెలరోజుల పాటు రాజశేఖర్ వద్దే తాము ముగ్గురం ఉన్నప్పటికీ ఎలాంటి అభ్యంతరం తెలపలేదని.. ఆస్పత్రి సిబ్బంది తమను కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారని జీవిత తెలిపారు. తమకు ఎంతగానో సహకరించిన వైద్యులు సహా వార్డు బాయ్ వరకూ ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అభిమానులు, కుటుంబ సన్నిహితుల ప్రార్థనలు ఫలించి రాజశేఖర్ కోలుకున్నారని జీవిత సంతోషం వ్యక్తం చేశారు.

More News

మ‌ళ్లీ హీరోగా సునీల్‌..?

క‌మెడియ‌న్ నుండి హీరోగా మారిన సునీల్‌కు అందాల రాముడు, పూల‌రండు, మ‌ర్యాద‌రామ‌న్న వంటి రెండు, మూడు త‌ప్ప చెప్పుకునేంత విజ‌యాలు లేక‌పోవ‌డంతో మ‌ళ్లీ క‌మెడియ‌న్‌గా మారిపోయాడు.

సిరిసిల్లలో కేటీఆర్‌ను ఓడిస్తా.. బీజేపీ ఎంపీ శపథం

రాష్ట్రమంత్రి కేటీఆర్‌పై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పన్నుల రూపంలో వచ్చిన డబ్బునే తిరిగి హైదరాబాద్ ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం సాయం రూపంలో

తండ్రి ఆరోగ్యంపై స్పందించిన శివాత్మిక రాజశేఖర్

తండ్రి ఆరోగ్యంపై శివాత్మిక రాజశేఖర్ స్పందించింది. ఇటీవల హీరో రాజశేఖర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సిటి న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు.

కమలా హ్యారిస్‌ టీమ్‌లో శతృఘ్నసిన్హా సోదరుని కుమార్తె!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా.. బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా తాజాగా కమలా హ్యారిస్‌తోపాటు తన సోదరుని కుమార్తె ప్రీతీ సిన్హా

బైడెన్ ఏడాదికి మించి బతకరంటూ కంగన సంచలన వ్యాఖ్యలు

అగ్రరాజ్యం అమెరికాకు కాబోయే అధ్యక్షుడు, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌పై బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జో బైడెన్ ఒక గజిని అని..