నటుడు రాజశేఖర్ కోలుకుటున్నారు: డాక్టర్ రత్న కిషోర్

  • IndiaGlitz, [Saturday,October 31 2020]

కరోనాతో బాధపడుతున్న హీరో రాజశేఖర్ క్రమక్రమంగా కోలుకుంటున్నట్టు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఫర్ సర్వీస్‌లో చికిత్సను అందుకుంటున్నారు. రాజశేఖర్ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసింది. ప్రస్తుతం రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. వైద్యానికి బాగా స్పందిస్తున్నారని సిటీ న్యూరో సెంటర్ వైద్యులు వెల్లడించారు.

‘‘డాక్టర్ వి.రాజశేఖర్ గారు కోవిడ్ 19 కారణంగా చికిత్స నిమిత్తం సిటీ న్యూరో సెంటర్ ఫర్ సర్వీస్‌లో చేరారు. ఆయన ప్రస్తుతం అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారు. ఆక్సిజన్ స్థాయిలు కూడా సంతృప్తి కరంగానే ఉన్నాయి. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ట్రీట్‌మెంట్‌కు సైతం రెస్పాండ్ అవుతున్నారు. మా వైద్యబృందం నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది’’ అని సిటీ న్యూరో సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రత్న కిషోర్ వెల్లడించారు.

More News

తొలి జేమ్స్ బాండ్ పాత్రధారి సీన్ కానరీ ఇక లేరు..

హాలీవుడ్ తొలి 'జేమ్స్ బాండ్' పాత్రధారి సీన్ కానరీ(90) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో బాధపడుతున్న సీన్ కానరీ శనివారం తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

‘ఆర్ఆర్ఆర్’ టీంకు బండి సంజయ్ వార్నింగ్..

‘ఆర్ఆర్ఆర్’ టీంకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు.

మహేశ్‌ న్యూ ఇయర్‌ ప్లానింగ్‌..!

సూపర్‌స్టార్‌ మహేశ్‌ సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో, ఫ్యామిలీకి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు.

పవర్‌స్టార్‌ సినిమాలో మరో హీరో ఈగ విలనేనా..?

ఈగ చిత్రంలో విలన్‌గా నటించి మెప్పించిన కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ తర్వాత తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడిగా మారారు.

చరణ్‌ రికార్డ్‌..!

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ పేరిట ఓ రికార్డ్ సొంతమైందని మెగాభిమానులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.