close
Choose your channels

కోలుకుంటున్న హీరో రాజశేఖర్.. వెంటిలేటర్ తొలగింపు

Friday, October 30, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కోలుకుంటున్న హీరో రాజశేఖర్.. వెంటిలేటర్ తొలగింపు

కరోనా నుంచి హీరో రాజశేఖర్ క్రమక్రమంగా కోలుకుంటున్నారు. నేడు ఆయనకు వెంటిలేటర్‌ను సైతం వైద్యులు తొలిగించారు. తమ కుటుంబం కరోనా బారిన పడిందని.. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నామంటూ రాజశేఖర్ వెల్లడించిన విషయం తెలిసిందే. తమ కూతుళ్లు కోలుకున్నారని తాను, జీవిత మాత్రం చికిత్స పొందుతున్నామని రాజశేఖర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ విషయాన్ని వెల్లడించిన కొద్ది రోజులకే ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది.

ఒకరోజు సడెన్‌గా రాజశేఖర్ కూతురు శివాత్మిక తన తండ్రి ఆరోగ్యం ఆందోళన కరంగా ఉందని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.‘‘కోవిడ్‌తో నాన్న పోరాటం కాస్త కష్టంగా మారింది. అయినా ఆయన ధైర్యంగానే పోరాడుతున్నారు. మీ ప్రార్థనలు, ప్రేమ, మద్దతు మమ్మల్ని కాపాడతాయని మేం బలంగా నమ్ముతున్నాం. నాన్న త్వరగా కోలుకోవాలని మీరందరూ దయచేసి ప్రార్థనలు చేయండి. మీ ప్రేమతో ఆయన క్షేమంగా తిరిగి వస్తారు’’ అని శివాత్మిక పేర్కొంది.

కాగా.. రాజశేఖర్ ఆరోగ్యం ఆందోళన కరంగా మారడంతో ఆయనను ఐసీయూకి తరలించి వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్సను అందిస్తూ వస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా.. నేడు వెంటిలేటర్‌ను తొలగించడమనేది శుభ పరిణామం. త్వరలో ఆయన డిశ్చార్జ్ అయి ఇంటికి తిరిగి వచ్చే అవకాశం ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.