శ్రీవల్లి విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది: రజత్

  • IndiaGlitz, [Saturday,September 16 2017]

సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన చిత్రం ద్వారా పరిశ్రమలోకి అడుగుపెట్టడం సవాలుగా అనిపించింది. ఇదొక అరుదైన అవకాశంగా భావించాను. సినీ పరిశ్రమలో దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నా కంటూ ఓ స్పెషాలిటిని క్రియేట్ చేసుకోవడమే నా లక్ష్యమని చెబుతున్నాడు యువహీరో రజత్. ఆయన కథానాయకుడిగా పరిచయమైన శ్రీవల్లి చిత్రం ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా రజత్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..

కాలేజీ రోజుల్నుంచే..
మా స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లె. నాకు కాలేజీ రోజుల నుంచే సినిమాలపై ఆసక్తి వుండేది. నాన్న విజయరామరాజు హైకోర్టులో క్రిమినల్ లాయర్‌గా పనిచేశారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వెంటనే సినిమాను కెరీర్‌గా ఎంచుకున్నాను. వైజాగ్ సత్యానంద్ ఇనిస్టిట్యూట్‌లో నటనలో శిక్షణ పొందాను. శ్రీవల్లి సినిమా కోసం విజయేంద్రప్రసాద్‌గారు ఆడిషన్స్ చేస్తున్నారని తెలిసి సంప్రదించాను. నా ప్రొఫైల్ నచ్చడంతో సినిమాకు ఎంపిక చేశారు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందు వర్క్‌షాప్ నిర్వహించడం నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచింది.

శ్రీవల్లి అద్భుతానుభవం...
సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన చిత్రం ద్వారా పరిశ్రమలోకి అడుగుపెట్టడం సవాలుగా అనిపించింది. ఇదొక అరుదైన అవకాశంగా భావించాను. విజయేంద్రప్రసాద్‌గారి సూచనలకు అనుగుణంగా నా పాత్రకు వందశాతం న్యాయం చేయడానికి ప్రయత్నించాను. గ్రాఫిక్స్ ప్రధాన చిత్రం కావడంతో ఎక్కువ భాగాన్ని బ్లూమ్యాట్‌లో తెరకెక్కించారు. మన పక్కన లేనటువంటి వాతావరణాన్ని ఊహించుకొని నటించడం ఛాలెంజ్‌గా అనిపించింది. సినిమాలోని చివరి 20 నిమిషాల్లో వచ్చే ైక్లెమాక్స్ ఘట్టాలు అద్భుతంగా వున్నాయని ప్రశంసలొస్తున్నాయి.

చిరంజీవిగారే స్ఫూర్తి...
ఎందరో వర్థమాన నటుల మాదిరిగానే నేను కూడా చిరంజీవిగారిని స్ఫూర్తిగా తీసుకొని పరిశ్రమలోకి వచ్చాను. నా వృత్తిలో అంకితభావాన్ని ప్రదర్శిస్తూ అనుకున్న లక్ష్యాల్ని చేరుకోవాలనుకుంటున్నాను. ఎలాంటి పాత్రల్లోనైనా రాణిస్తాననే నమ్మకముంది. నేటి ట్రెండ్‌కు అనుగుణంగా యువతరాన్ని మెప్పించే వినూత్న పాత్రల్ని చేయాలనుకుంటున్నాను. శ్రీవల్లి విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో విజయవంతంగా కెరీర్‌ను కొనసాగిస్తాననే నమ్మకముంది.

More News

ఆ లిస్ట్ లో అఖిల్ చేరతాడా?

ఇప్పుడున్న అగ్ర కథానాయకుల్లో చాలా మంది తొలి చిత్రంతో హిట్ కొట్టలేకపోయినా.. రెండో చిత్రంతో మాత్రం విజయాన్ని తమ సొంతం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ కి తొలి హిట్, రెండో చిత్రమైన గోకులంతో సీత ఇస్తే.. ఎన్టీఆర్ కి రెండో చిత్రం స్టూడెంట్ నెం.1 ఇచ్చింది.

ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు

మహానటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం మహానటి. టైటిల్ రోల్లో కీర్తి సురేష్ నటిస్తుండగా.. ముఖ్య పాత్రల్లో సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ ల్మాన్, ప్రకాష్ రాజ్, షాలిని పాండే తదితరులు నటిస్తున్నారు.

రాశి.. మూడేళ్ల త‌రువాత‌

2014లో విడుద‌లైన త‌న తొలి తెలుగు చిత్రం ఊహ‌లు గుస‌గుస‌లాడే తో మంచి న‌టిగా పేరు తెచ్చుకున్న రాశి ఖ‌న్నా.. త‌న రెండో తెలుగు చిత్రం జోరుతో మంచి గాయ‌నిగానూ పేరు తెచ్చుకుంది.

ఆ ద‌ర్శ‌కుడికి అదో స‌ర‌దా

ప‌టాస్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన అనిల్ రావిపూడి.. రెండో చిత్రాన్ని సుప్రీమ్‌గా తెర‌కెక్కించి మ‌రో హిట్‌ని త‌న ఖాతాలో వేసుకున్నాడు.

ఇప్పుడు ప్ర‌భుదేవా వంతు..

సీనియ‌ర్ హీరోల‌తో పాటు, క‌థ‌, క‌థ‌నం బావుంటే యంగ్ హీరోలు కూడా నెగ‌టివ్ షేడ్ ఉన్న క్యారెక్ట‌ర్స్ చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. వివ‌రాల్లోకెళ్తే..కొరియోగ్రాఫర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్ర‌భుదేవా త‌ర్వాత డ్యాన్స్ మాస్ట‌ర్‌గా, న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా మారారు.