నటకిరీటి రాజేంద్రప్రసాద్ నటనకి 40 ఏళ్లు..

  • IndiaGlitz, [Tuesday,September 05 2017]

హాస్య క‌థానాయ‌కుడికి స్టార్ ఇమేజ్‌ని తీసుకొచ్చిన న‌టుడు రాజేంద్ర‌ప్ర‌సాద్‌. ఆయ‌న న‌టించిన తొలి చిత్రం 'స్నేహం'. బాపు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 5, 1977న‌ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. అంటే.. వెండితెర‌పై రాజేంద్ర‌ప్ర‌సాద్ చేస్తున్న సంద‌డికి నేటితో 40 ఏళ్లు పూర్త‌వుతున్నాయ‌న్న‌మాట‌. అయితే ఈ 40 ఏళ్ల‌ల్లో ఒక్క కామెడీ వేషాల‌కే రాజేంద్ర‌ప్ర‌సాద్ ప‌రిమితం కాలేదు.. విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లెన్నింటికో ప్రాణం పోశాడు.
'లేడీస్ టైల‌ర్‌', 'ఏప్రిల్ 1 విడుద‌ల‌', 'పెళ్లిపుస్త‌కం', 'మిస్ట‌ర్ పెళ్లాం', 'మాయ‌లోడు', 'రాజేంద్రుడు గ‌జేంద్రుడు', 'ఆ ఒక్క‌టీ అడ‌క్కు', 'అప్పుల అప్పారావు' త‌దిత‌ర చిత్రాల్లో హాస్యంతో పాటు న‌వ‌ర‌సాల‌కి చోటు ఉంటే.. 'ఎర్ర‌మందారం', 'ఆ న‌లుగురు', 'మీ శ్రేయోభిలాషి', 'ఓన‌మాలు' త‌దిత‌ర చిత్రాలు ఆయ‌నలోని న‌టుడ్ని కొత్త కోణంలో చూపాయి. న‌టుడిగా 40 ఏళ్ల ప్ర‌స్థానాన్ని పూర్తిచేసుకుంటున్న రాజేంద్ర‌ప్ర‌సాద్‌కి ఈ సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలుపుదాం.

More News

సెప్టెంబర్ 7న 'మహనుభావుడు' టైటిల్ సాంగ్ సింగిల్ విడుదల

శర్వానంద్ హీరోగా,మెహ్రీన్ హీరోయిన్ గా,మారుతి దర్శకత్వంలో యు.వి.క్రియోషన్స్

క‌థానాయకుడిగా 9 ఏళ్లు పూర్తిచేసుకున్న నాని

కొంద‌రి న‌ట‌న చూస్తే వారేదో న‌టిస్తున్న‌ట్లు అనిపించ‌దు. మ‌న ప‌క్కింటి అబ్బాయినో, అమ్మాయినో తెరపై చూస్తున్నామ‌నిపిస్తుంది. అలాంటి ప‌క్కింటి అబ్బాయి త‌ర‌హా పాత్ర‌ల్లో ఇట్టే ఒదిగిపోయి.. స‌హ‌జ‌న‌టుడుగా పేరు తెచ్చుకున్నాడు నాని.

వందేమాతరం శ్రీనివాస్ కు 'కాళోజి' పురస్కారం

ప్రజా కవి,పద్మ విభూషణ్ కాళోజి నారాయణ రావు జయంతి సందర్భంగా

ఆస్కార్ అవార్డుల దేశీయ కమెటీ ఛైర్మెన్ గా ఎన్నికైన సివిరెడ్డి

ప్రపంచ సినిమాలో మేటి అయిన ఆస్కార్ అవార్డు కమెటీకి భారత దేశపు సినిమాను ఎంపిక చేసే కమెటీకి ఛైర్మెన్ గా ప్రముఖ దర్శకుడు నిర్మాత సివిరెడ్డి ఎంపిక అయ్యారు..

మెగాస్టార్ ఆవిష్కరించిన ఇంద్రసేన ఫస్ట్ లుక్

వైవిధ్యమైన సినిమాలతో, వరుస కమర్షియల్ సక్సెస్ లతో    తనకంటూ ఓ మార్క్ ను సృష్టించుకున్న హీరో విజయ్ ఆంథోని తాజాగా నటిస్తొన్న చిత్రం "ఇంద్రసేన".