మహేశ్ ఫ్యాన్స్కు రాజేంద్రప్రసాద్ గుడ్న్యూస్!
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్స్టార్ మహేష్, రష్మిక మందన్నా నటీనటులుగా టాలెంటెడ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి నటిస్తున్నారు. సినిమా రిలీజ్కు రోజులు దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేస్తోంది. అయితే సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అని మహేశ్ వీరాభిమానులు వేయికళ్లతో వేచి చూస్తున్నారు. మరోవైపు సూపర్ డూపర్ హిట్టవుతుందని.. కలెక్షన్లకు కొదువే ఉండదని మరో ‘పోకిరీ’లాగా కాసుల వర్షం కురిపిస్తుందని అభిమానులు ధీమాగా సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు.
నేను డబ్బింగ్ చెప్పుకున్నా!
కాగా.. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో చేశారు. ఈ సినిమా గురించి తాజాగా ఆయన మాట్లాడుతూ మహేశ్ అభిమానులకు తియ్యటి శుభవార్త చెప్పారు. ఈ చిత్రంలో తాను కీలకమైన పాత్రను పోషించానని.. ఇది ఇంతవరకూ చేసిన పాత్రలకి భిన్నంగా ఉంటుందన్నారు. అంతేకాదు.. తన పాత్రకి సంబంధించి తానే డబ్బింగ్ కూడా చెప్పుకున్నానన్నారు.
‘సరిలేరు..’ పక్కా హిట్!
ఇక సినిమా గురించి చెబుతూ.. సినిమా చాలా బాగా వచ్చిందన్నారు. అనిల్ రావిపూడి ప్రతి పాత్రను చాలా చక్కగా తీర్చిదిద్దాడని ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన తెరకెక్కించిన విధానంతో అనీల్ ప్రత్యేకత ఏంటనేది చాలా క్లారిటీగా తనకు అర్థమైందన్నారు. మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో ఇదివరకు ఎప్పుడూ చూడని కొత్త మహేశ్ కనిపిస్తాడని.. మహేశ్ అభిమానులు ఎగిరి గంతేసే రోజులు ముందున్నాయి అన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు.
‘సరిలేరు నీకెవ్వరు’ తప్పకుండా సూపర్ హిట్టవుతుందని.. మహేశ్ బాబు ఖాతాలో మరో బ్లాక్ బస్టర్గా చేరిపోతుందనే నమ్మకం తనకుందని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. అయితే రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలతో మహేశ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇంత సీనియర్ నటుడే హిట్టవుతుందని కితాబిచ్చేశారు.. ఇక ‘మా మహేశ్కు సాటెవ్వరు’ అని అభిమానులు చెప్పుకుంటున్నారు. అయితే ‘సరిలేరు..’ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియాలంటే 2020 సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.