డబ్బింగ్ కార్యక్రమాల్లో '2.0'

  • IndiaGlitz, [Saturday,May 13 2017]

సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ మ‌రోసారి రోబో చిట్టిగా త‌న మాయాజాలాన్ని తెర‌పై చూపించ‌డానికి రెడీ అవుతున్నాడు. ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ రోబో సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది.

లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై దాదాపు నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అక్ష‌య్‌కుమార్ విల‌న్‌గా న‌టిస్తుంటే, ఎమీ జాక్స‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో రూపొందుతోన్నఈ సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల్లో భాగంగా డ‌బ్బింగ్ జ‌రుపుకుంటుంది. విఎఫెక్స్ వ‌ర్క్ స‌హా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌ల ప్లాన్‌.