'2.0' విడుదలపై రజనీ క్లారిటీ

  • IndiaGlitz, [Saturday,December 30 2017]

శివాజీ, రోబో చిత్రాల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన కాంబినేష‌న్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, టాప్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ది. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌స్తున్న మూడో చిత్రం '2.0'. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ నెగెటివ్ టచ్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. శంక‌ర్ గ‌త చిత్రం 'ఐ'లో క‌థానాయిక‌గా న‌టించిన ఎమీ జాక్స‌న్ ఇందులో కూడా హీరోయిన్‌గా న‌టిస్తోంది. డ‌బుల్ ఆస్కార్ అవార్డ్స్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రం జ‌న‌వ‌రి 25న విడుద‌ల కావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా ఏప్రిల్‌కి వాయిదా ప‌డింది. అయితే డేట్ విష‌యంలో మాత్రం ఇప్ప‌టివర‌కు క్లారిటీ రాలేదు. అయితే.. ర‌జ‌నీ ఈ విష‌యంపై క్లారిటీ ఇచ్చారు. ఆయ‌న్ని క‌ల‌వ‌డానికి వ‌చ్చిన అభిమానుల‌తో ఏప్రిల్ 14న త‌మిళ నూత‌న సంవ‌త్స‌రాది సంద‌ర్భంగా ఈ సినిమాని అన్ని భాష‌ల్లోనూ ఒకే సారి విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించార‌ని తెలిసింది. దీంతో.. ఏప్రిల్ 27న రానున్న 'భ‌ర‌త్ అనే నేను', 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' చిత్రాల‌కి విడుద‌ల విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది.

More News

మహేష్ హీరోయిన్ తో చరణ్ రొమాన్స్?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రంగస్థలం చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.

'సవ్యసాచి' లో భూమిక ప్రయోగం

'ప్రేమమ్'వంటి హిట్ చిత్రం తరువాత యువ కథానాయకుడు నాగచైతన్య,యువ దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్లో

మెగాహీరోతో నందమూరి నటుడు?

ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.ఇంతకీ అదేమిటంటే..

'టచ్ చేసి చూడు'.. మళ్ళీ వాయిదా?

రాజా ది గ్రేట్ తో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు మాస్ మహారాజా రవితేజ.

సెన్సార్ పూర్తి చేసుకొన్న'హార్ట్ బీట్'

ధృవ, వెంబ జంటగా దేవాస్ మీడియా & ఎంటర్ టైన్మెంట్ పతాకంపై శ్యామ్ దేవభక్తుని నిర్మాణ సారధ్యంలో ద్వారక్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'హార్ట్ బీట్'.