అమిత్ షాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రజినీకాంత్
Send us your feedback to audioarticles@vaarta.com
హిందీ దివస్ను పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. యావత్ భారతావనిని ఒక్క తాటి పైకి తీసుకురాగల సామర్థ్యం హిందీకి ఉందని నొక్కి చెప్పిన సంగతి తెలిసిందే. భారతదేశంలో అనేక భాషలు ఉన్నా.. దేశానికి ఒక కామన్ లాంగ్వేజ్ ఉండాల్సిన అవసరం ఉందని.. ఎక్కువ మంది మాట్లాడే హిందీ భాష దేశాన్ని ఐక్యంగా ఉంచడంలో దోహదపడుతుందని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని ఆయన.. దేశమంతా హిందీని ప్రాథమిక భాషగా చేయాల్సిన అవసరం ఉందని.. యావత్ భారతానికి ఒకే భాష ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం ఉందని ట్విట్టర్ వేదికగా ఆయన బల్లగుద్ది మరీ చెప్పారు.
ఒకే భాష ఉంటే మంచిదే కానీ..!
అయితే ఈ వ్యవహారంపై తాజగా సూపర్స్టార్ రజనీకాంత్ స్పందించారు. బుధవారం నాడు చెన్నైలో మీడియాతో మాట్లాడిన రజనీ.. అమిత్ షాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘దేశమంతా ఒకే భాష ఉంటే మంచిదే కానీ.. ఇండియా అంతటా ఒకటే భాష అసాధ్యం. మాతృభాష మాట్లాడటం మన హక్కు. దీన్ని రాజకీయాలకు వాడుకోవడం తగదు. హిందీని బలవంతంగా రుద్దకూడదు. హిందీని బలవంతంగా రుద్దడాన్ని కేవలం తమిళనాడు మాత్రమే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రమూ ఆమోదించదు. ఆ మాటకొస్తే కొన్ని ఉత్తరాది రాష్ట్రాలు సైతం హిందీని రుద్దడాన్ని వ్యతిరేకిస్తాయి. హిందీ మాత్రమే కాదని.. ఏ భాషనైనా సరే బలవంతంగా రుద్దకూడదు. ఉమ్మడి భాష ఉన్నట్లయితే దేశ సమైక్యతకు, అభివృద్ధికి మంచిదేనని, అయితే భాషను బలవంతంగా రుద్దడం ఆమోదయోగ్యం కాదు’ అని రజనీకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రజనీ వ్యాఖ్యలపై బీజేపీ నేతల, ముఖ్యంగా షా ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.