ఓటు వేయలేకపోయిన రజనీకాంత్
- IndiaGlitz, [Sunday,June 23 2019]
నేడు (ఆదివారం) నడిగర్ సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. చెన్నై సెయింట్ ఎబ్బాస్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండ్రీ స్కూల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
సాధారణంగా నడిర్ సంఘం ఎన్నికల్లో ఎప్పుడూ ఓటు వేసే సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఏడాది ఓటు వేయలేకపోతున్నాడు. అందుకు కారణం. ఆయన ముంబైలో 'దర్బార్' షూటింగ్లో బిజీగా ఉన్నారట. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. ఇలాంటి పరిణామం తనకు కొత్తగా ఉందని, ఇకపై ఇలాంటి విషయం జరగకూడదని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ పాండవర్ జట్టు, స్వామిశంకర్ దాస్ జట్టు ఈసారి నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి.