రజనీ మాటల రచయితే కమల్ కి కూడా..

  • IndiaGlitz, [Thursday,January 25 2018]

లోక నాయ‌కుడు కమల్ హాసన్, సూప‌ర్ డైరెక్ట‌ర్ శంకర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన‌ భారతీయుడు' ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సీక్వెల్‌ని 2.O' నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. కోలీవుడ్ సమాచారం ప్రకారం.. భారతీయుడు 2' త‌మిళ వెర్ష‌న్‌కి మాటలు రాసే పనిని జయమోహన్‌కి అప్పగించారట శంకర్. ప్రస్తుతం ఈ మాటల రచయిత 2.O'కి మాటలను అందిస్తున్నారు.

జయమోహన్ ర‌చ‌నాశైలి నచ్చి శంకర్ ఈ బాధ్యతని అప్పగించారని తమిళ్ ఇండస్ట్రీ చెబుతోంది. తాజాగా ప్రీ-ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టిన భారతీయుడు 2' టీంతో.. శంకర్ తన అప్ కమింగ్ మూవీ 2.O' ప‌నుల‌న్నింటిని ముగించిన తర్వాత వచ్చి చేరుతారని సమాచారం. ఇదిలా వుంటే...రజనీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన‌ 2.O' ఏప్రిల్ 14న తమిళ్ న్యూ ఇయర్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.