ర‌కుల్ త‌ప్పుకుంది

  • IndiaGlitz, [Thursday,October 13 2016]

ర‌కుల్ ప్రీత్ సింగ్ తెలుగులో స్టార్ హీరోల‌తో న‌టిస్తూ వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకుంటూ దూసుకెళుతుంది. ఇప్పుడు త‌మిళంలో కూడా అడుగుపెట్టింది. విశాల్ హీరోగా మిస్కిన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న తుప్ప‌రివాల‌న్ చిత్రంలో ముందుగా ర‌కుల్ ప్రీత్ సింగ్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. అయితే ర‌కుల్ కేటాయించిన డేట్స్‌లో చిత్రీక‌ర‌ణ చేయ‌డానికి విశాల్ అండ్ టీంకు కుద‌ర‌లేదు. అదీ కాకుండా ర‌కుల్ మ‌హేష్ సినిమాతో, సాయిధ‌ర‌మ్ తేజ్‌, గోపీచంద్ మ‌లినేని మూవీలో న‌టిస్తుంది. డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌డం ర‌కుల్‌కు క‌ష్టం కావ‌డంతో సినిమా నుండి త‌ప్పుకుంద‌ట‌. ఈ సినిమాలో మ‌రో హీరోయిన్‌గా అక్ష‌ర హాస‌న్ న‌టిస్తుంది.

విశాల్ ఇప్పుడు ఒక్క‌డొచ్చాడు సినిమాను విడుద‌ల‌కు స‌న్న‌ద్ధం చేస్తున్నాడు. ఈ సినిమాను దీపావ‌ళి సంద‌ర్భంగా విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు కానీ ప‌రిస్థితులు చూస్తుంటే సినిమా దీపావ‌ళికి విశాల్ సినిమా రావ‌డం లేద‌ని తెలుస్తుంది. ఒక్క‌డొచ్చాడు సినిమాలో త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంటే..జ‌గ‌ప‌తిబాబు కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు.