close
Choose your channels

డ్రగ్స్ కేసు విషయమై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన రకుల్..

Thursday, September 17, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

డ్రగ్స్ కేసు విషయమై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన రకుల్..

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా బాగా వినిపిస్తోంది. అయితే దీనిపై రకుల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. డ్రగ్స్ కేసులో తనకు వ్యతిరేకంగా మీడియాలో వస్తున్న కవరేజీ ఆపాలని ఐఅండ్‌బి మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ రకుల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రకుల్‌ప్రీత్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. జస్టిస్ నవీన్ చావ్లా సింగిల్ బెంచ్ ముందు విచారణ జరగనుంది.

బాలీవుడ్‌లో డ్రగ్స్ కోణం బయటపడటమే కాకుండా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రకుల్ ప్రీత్ పేరు బయటకు రావడంతో టాలీవుడ్‌లోనూ ప్రకంపనలు చెలరేగాయి. సుశాంత్ అనుమానాస్ప‌ద మృతి కేసులో డ్ర‌గ్స్ కోణం బ‌య‌ట ప‌డ‌టంతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగి రియా చ‌క్ర‌వ‌ర్తిని, ఆమె సోద‌రుడు స‌హా మ‌రికొంత మందిని అరెస్ట్ చేసింది. ఈ వ్య‌వ‌హారంలో బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్‌, టాలీవుడ్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ పేర్ల‌ను రియా వెల్ల‌డించిన‌ట్లు వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేశాయి. దీంతో ఎన్‌సీబీ ఈ పుకార్లకు చెక్ పెట్టింది.

డ్రగ్స్ కేసు విషయమై ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్ట‌ర్ కేపీఎస్ మ‌ల్హోత్రా స్పందించారు. మాదక ద్రవ్యాలను సరఫరా చేసే ముఠా వివరాలను సేకరించామన్నారు. అయితే బాలీవుడ్ ప్రముఖుల జాబితాను మాత్రం సిద్ధం చేసుకోలేదన్నారు. కానీ అందరూ దాన్ని బాలీవుడ్ ప్రముఖుల లిస్టుగా అపార్థం చేసుకున్నారని మల్హోత్రా తెలిపారు. లిస్టులో రకుల్, రియా పేర్లు ఉన్నట్లుగా వచ్చిన వార్తలను కొట్టి పడేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.