కోవిడ్ 19 ప్ర‌భావం.. మురికివాడ‌లో పేద‌ల‌కు ర‌కుల్ సాయం

  • IndiaGlitz, [Monday,April 06 2020]

క‌రోనా వైర‌స్‌(కోవిడ్ 19) ప్ర‌భావంతో దేశ‌మంతా లాక్ డౌన్ అయ్యింది. ఏప్రిల్ 14 వ‌ర‌కు లాక్ డౌన్ కొన‌సాగుతుంది. అప్ప‌టి వ‌ర‌కు రోజువారీ కూలీలు, కార్మికుల‌కు చాలా ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. చాలా మంది పేద‌ల‌కు తిండి దొర‌క‌డం క‌ష్ట‌మ‌వుతుంది. ఈ సంద‌ర్భంలో పలువురు సినీ తార‌లు పేద ప్ర‌జ‌ల‌కు త‌మ వంతు సాయాన్ని అందిస్తున్నారుజ‌. తాజాగా ఈ లిస్టులో హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ కూడా చేరింది.

ప్ర‌స్తుతం గుర్గావ్‌లోని త‌న ఇంట్లో ఉంటున్న ర‌కుల్ ప్రీత్ సింగ్ త‌న ఇంటి ద‌గ్గ‌ర ఉన్న మురికివాడ‌లోని 250 మంది పేద‌వాళ్ల‌కు రెండు పూట‌ల తిండిని అందిస్తున్నార‌ట‌. ఈ విష‌యాన్ని ర‌కులే చెప్పారు. తండ్రి సాయంతో ప‌క్క‌నున్న పేద‌వారి గురించి వివ‌రాల‌ను సేక‌రించిన ర‌కుల్ త‌న ఇంటి ద‌గ్గ‌ర‌లోనే తిండిని వండించి అందిస్తుంద‌ట‌. లాక్ డౌన్ ప‌రిస్థితి కొన‌సాగే వ‌ర‌కు ఈ పేద‌వారికి రెండు పూట‌ల తిండిని అందిస్తామ‌ని, ఒక‌వేళ లాక్ డౌన్ కొన‌సాగితే కూడా వారికి తిండిని అందిస్తామని ర‌కుల్ తెలిపారు. ప్ర‌స్తుతం తెలుగులో సినిమాలేవీ చేయ‌ని ర‌కుల్ హిందీలో అజ‌య్ దేవ‌గణ్‌తో ఓ సినిమాను.. తెలుగులో నితిన్, చంద్ర శేఖ‌ర్ ఏలేటి సినిమాలోనూ న‌టించ‌నుంది.

More News

ప‌వ‌న్ 27లో అనుష్క‌..?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత రెండు సినిమాల్లో న‌టిస్తున్నారు. బాలీవుడ్ చిత్రం ‘పింక్‌’ రీమేక్‌ను ‘వ‌కీల్‌సాబ్‌’గా తెర‌కెక్కిస్తోన్న

గ్యాప్‌లో.. ప్ర‌భాస్ 21 ద‌ర్శ‌కుడేం చేస్తున్నాడంటే..?

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం త‌న 20 సినిమాను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు. అదే స‌మ‌యంలో త‌న 21వ సినిమాను నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్

'లూసీఫర్' రీమేక్‌ పవన్ చేస్తానంటే.. : చిరు రియాక్షన్ ఇదీ..

మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ టైటిల్ పాత్రలో న‌టించిన ‘లూసిఫ‌ర్‌’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌నున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రామ్‌చ‌ర‌ణ్ నిర్మించ‌బోతున్నాడు.

'ఆచార్య'లో మహేశా.. చెర్రీనా.. క్లారిటీ ఇచ్చేసిన చిరు

టాలీవుడ్ మోగాస్టార్ చిరంజీవి.. సూపర్ హిట్ చిత్రాల, సందేశాత్మక చిత్రాల దర్శకుడు కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా ‘ఆచార్య’. ఇప్పటికే సినిమాకు సంబంధించి దాదాపు అన్ని విషయాలు లీకైపోయాయి.

గోపీచంద్ స‌ర‌స‌న హాట్ బ్యూటీ

టాలీవుడ్ యాక్ష‌న్ స్టార్ గోపీచంద్ హీరోగా సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సీటీమార్’. స్పోర్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది.