close
Choose your channels

శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఇండియ‌న్2లో ర‌కుల్‌

Saturday, July 20, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఇండియ‌న్2లో ర‌కుల్‌

నా జీవితంలో అంద‌రిలా నాకూ ఏడాదికి 365 రోజులే. అన్ని రోజులూ నాన్‌స్టాప్‌గా ప‌నిచేస్తూనే ఉన్నాను. అంత‌కు మించి ఇంకేం చేయ‌మంటారు? అని అడుగుతోంది ర‌కుల్‌. తెలుగులో మ‌రిన్ని సినిమాలు చేయ‌లేద‌ని అడిగిన ప్ర‌శ్న‌కు ఆమె స‌మాధానం. ఆమె చెప్పిన అంశంలోనూ నిజం ఉంది. ర‌కుల్ ఇప్పుడు తెలుగుతో పాటు త‌మిళ్‌, హిందీలోనూ వ‌రుస‌గా సినిమాల‌కు సంత‌కం చేస్తోంది. తాజాగా క‌మ‌ల్ ఇండియ‌న్‌2కు సంత‌కం చేయ‌నుంది. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్ స‌ర‌స‌న ఆమె న‌టించ‌నుంది. ఈ చిత్రంలో క‌మ‌ల్‌హాస‌న్ గ్రాండ్‌స‌న్‌గా సిద్ధార్థ్ క‌నిపిస్తారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తున్న చిత్రమిది. ``ఈ పాత్ర‌కు ర‌కుల్ చ‌క్క‌గా స‌రిపోతుంద‌ని శంక‌ర్ న‌మ్మారు. ఇటీవ‌ల ఆయ‌న కో డైర‌క్ట‌ర్లు ముంబైలో ర‌కుల్‌కు క‌థ చెప్పారు.

ఆమెకు కూడా క‌థ న‌చ్చింది. ఇలాంటి క‌థ‌ల్లో చిన్న పాత్ర చేసినా త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల గుండెల్లో నిలిచిపోతామ‌నే సంగ‌తి ఆమెకు బాగా తెలుసు. అందుకే ఆమె క‌థ విన‌గానే అంగీకారాన్ని తెలిపారు. త్వ‌ర‌లోనే డాటెడ్ లైన్స్ లో సంత‌కం చేస్తుంది`` అని స‌న్నిహితులు తెలిపారు. ఈచిత్రంలో ఇప్ప‌టికే కాజ‌ల్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆమెతో పాటు ఐశ్వ‌ర్య రాజేష్‌, ప్రియా భ‌వానీ శంక‌ర్ న‌టిస్తున్నారు. విద్యుత్ జ‌మ్మ‌వాల్ న‌టిస్తున్నారు. 1996లో విడుద‌లైన ఇండియ‌న్ సినిమాకు సీక్వెల్ ఇది. క‌రెప్ష‌న్‌కు వ్యతిరేకంగా వ‌చ్చిన ఈ చిత్రం అప్ప‌ట్లో భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ్‌, హిందీలో రూపొందుతోంది. త‌దుప‌రి షెడ్యూల్ చెన్నైలో ఆగ‌స్ట్ 19 నుంచి ఉంటుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.