close
Choose your channels

‘ఆచార్య’ సెట్స్‌లో రామ్ చరణ్..

Sunday, December 27, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. చిరు 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’పై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం చెర్రీ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో నిన్నటి వరకూ చెర్రీ ‘ఆచార్య’ సెట్స్‌లోకి ఎంట్రీ ఇవ్వలేదు.

ఇవ్వాళ సడెన్‌గా రామ్ చరణ్‌ సెట్స్‌లో జాయిన్ అవడంతో మంచి జోష్ వచ్చింది. వస్తూ వస్తూనే సెట్ అంతా చూసి ఆర్ట్‌ డైరెక్టర్‌ సాహి సురేష్‌ను అభినందించాడు. కాగా.. చెర్రీ ఈ సినిమాలో నక్సలైట్ నాయకుడిగా నటిస్తున్నాడు. కాగా.. నేడు సెట్స్‌లో చెర్రీ జాయిన్ అయిన విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్‌ ఫొటోలను షేర్‌ చేసింది. అవి చూసి అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. నిరంజన్‌ రెడ్డి, రామ్‌ చరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రెస్టీజియస్ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

మంచి సందేశాన్ని కమర్షియల్‌ అంశాలను మిక్స్‌ చేసి సినిమాను ప్రేక్షకులను తెరకెక్కించడంలో దిట్ట అయిన డైరెక్టర్‌ కొరటాల శివ మెగాస్టార్ ద్వారా మరో సందేశాన్ని అందించబోతున్నారు. ఈ చిత్రంలో చిరు నక్సలైట్ పాత్రలో అలరించబోతున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. కాగా.. రామ్ చరణ్‌కు జోడిగా పూజా హెగ్డే నటించనుందని టాక్ నడుస్తోంది. మొత్తానికి ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.