close
Choose your channels

డ‌బ్బింగ్ ప‌నిలో బిజీ అయిపోయిన చ‌ర‌ణ్‌

Tuesday, March 6, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రామ్ చరణ్, సమంత జంటగా నటించిన సినిమా 'రంగస్థలం'. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 1985నాటి పరిస్థితులకు అద్దం పడుతూ పూర్తిగా గ్రామీణ వాతావరణంలో రూపుదిద్దుకుంది ఈ మూవీ. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇదిలా వుంటే.. ఈ సినిమాలో చరణ్ బ‌ధిరుడి పాత్రను పోషించిన సంగ‌తి తెలిసిందే.

అంతేగాకుండా, తన పాత్రనుగుణంగా కామెడీని కూడా బాగా పండించారని ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలతో తెలుస్తోంది. చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం డబ్బింగ్ ప‌నుల‌ను జ‌రుపుకుంటోంది. గోదావరి యాసతో మాట్లాడడానికి చరణ్ బాగానే హోం వర్క్ చేశారనీ.. ప్ర‌స్తుతం తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకునే పనిలో ఆయ‌న బిజీగా ఉన్నారని చిత్ర వర్గాలు తెలుపుతున్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు, అనసూయ, ప్ర‌కాష్ రాజ్ ముఖ్య పాత్ర‌లు పోషించారు. అలాగే పూజా హెగ్డే ఓ ప్రత్యేక గీతంలో నర్తించిన విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ సినిమా మార్చి 30న విడుదల కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.