డిసెంబర్ 4న గ్రాండ్ లెవల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 'ధృవ' ప్రీ రిలీజ్ ఫంక్షన్

  • IndiaGlitz, [Tuesday,November 29 2016]

మెగాభిమానులు, తెలుగు సినీ ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న స్ట‌యిలిష్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'ధృవ‌'. మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌రణ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర‌వింద్‌, ఎన్‌.వి.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా ప్ర‌క‌టించిన రోజు నుండే సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఎందుకంటే మ‌గ‌ధీర వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌ర్వాత రాంచ‌ర‌ణ్‌, గీతార్ట్స్ బ్యాన‌ర్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మూవీ 'ధృవ' కావ‌డంతో సినిమా ఎప్పుడు విడుద‌ల‌వుతుందా అని ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.

అంద‌రి అంచ‌నాల‌కు మించుతూ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, సాంగ్స్ స‌హా రీసెంట్‌గా విడుద‌లైన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ వ‌ర‌కు 'ధృవ' ఆడియెన్స్ నుండి అద్భుత‌మైన రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంటుంది. విడుద‌లైన ఇరవై నాలుగు గంట‌ల్లోనే మిలియ‌న్ వ్యూస్‌ను రాబట్టుకున్న 'ధృవ‌' థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ఇప్ప‌టికి నాలుగు మిలియ‌న్స్‌కు పైగా వ్యూస్‌ను రాబ‌ట్టుకుంది. హై బ‌డ్జెట్‌, టెక్నిక‌ల్ వాల్యూస్‌తో రూపొందిన ఈ సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 9న విడుద‌ల చేస్తున్నారు. అంత కంటే ముందుగా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, ప్రేక్ష‌కులు, మెగాభిమానుల స‌మ‌క్షంలో డిసెంబ‌ర్ 4న హైదరాబాద్ యూస‌ఫ్ గూడ పోలీస్ లైన్స్‌లో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు.

రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు న‌టించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌- పి.య‌స్‌.వినోద్‌, మ్యూజిక్ - హిప్ హాప్ త‌మిళ , ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్, ఆర్ట్ - నాగేంద్ర, ఎడిటర్ - నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.వై. ప్రవీణ్ కుమార్, ప్రొడ్యూసర్స్ - అల్లు అరవింద్, ఎన్‌.వి.ప్ర‌సాద్‌, దర్శకుడు - సురేందర్ రెడ్డి.

More News

జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు చేసిన ప‌నికి ప‌వ‌న్ అభినంద‌న‌లు..!

500, 1000 నోట్ల ర‌ద్దు చేయ‌డంతో ప్ర‌జ‌లు ఎంత ఇబ్బంది ప‌డుతున్నారో తెలిసిందే.  ఇక‌ హాస్ప‌ట‌ల్స్ లో ఉన్న రోగుల కుటుంబ స‌భ్యులు అయితే... నోట్ల ర‌ద్దుతో చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు.

చిరు 151, 152 రెడీ..!

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 150వ చిత్రం ఖైదీ నెం 150. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ తెర‌కెక్కిస్తున్న ఖైదీ నెం 150 చిత్రం సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

యాడ్ షూట్ తో బిజీ

అఖిల్ సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోని అక్కినేని మూడోతరం వారసుడు అక్కినేని అఖిల్. ఇప్పుడు తన రెండో సినిమాపై అచి తూచి అడుగులేస్తున్నాడు.

మలయాళీ హీరోయిన్ తో విక్రమ్...

`ఇంకొక్కడు` వంటి స్పై థ్రిల్లర్తో మంచి సక్సెస్ అందుకున్న చియాన్ విక్రమ్ ఇప్పుడు విజయ్ చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో నటిస్తున్నాడు.

త్రి ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ ఇక్క‌డ - ర‌కుల్ ప్రీత్ సింగ్..!

వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయిక ర‌కుల్ ప్రీత్ సింగ్. ఆత‌ర్వాత లౌక్యం, క‌రెంట్ తీగ‌, పండ‌గ చేస్కో నాన్న‌కు ప్రేమ‌తో.., స‌రైనోడు...త‌దిత‌ర చిత్రాల‌తో అన‌తికాలంలోనే మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న ర‌కుల్ ప్రీత్ సింగ్.