చ‌ర‌ణ్ భాడీ ఫిట్‌నెస్ వెనుక సీక్రెట్ ఇదే...

  • IndiaGlitz, [Thursday,January 03 2019]

'విన‌య‌విధేయరామ' చిత్రంలో ఆరు ప‌ల‌క‌ల దేహంతో చ‌ర‌ణ్ చొక్కా విప్పి విల‌న్స్ భ‌ర‌తం ప‌డుతుంటే ఆడియెన్స్ ఆనందంగా విజిల్స్ వేశారు. అయితే ఆ లుక్ కోసం చ‌ర‌ణ్ ఎంత‌గానో క‌ష్ట‌ప‌డ్డాడు. రాకేష్ ఉదియార్ శిక్ష‌ణ‌లో క‌స‌రత్తులు చేసిన రాంచ‌ర‌ణ్  ఆహారం విష‌యంలోనూ ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌ట‌. ఈ విష‌యాన్ని ఆయ‌న స‌తీమ‌ణి ఉపాస‌న తెలియ‌జేశారు.

ప్రొటీన్స్‌, కార్బోహైడ్రేట్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ ఆహారాన్ని తీసుకున్నాడ‌ట రాంచ‌ర‌ణ్‌. ఉద‌యంపూట మూడు తెల్ల‌గుడ్డు సొన‌లు, రెండు గుడ్లుతో పాటు 3/4 క‌ప్పు ఓట్స్‌, ఆల్‌మండ్ పాలు తీసుకునేవాడు.

11.30 గంట‌ల‌కు వెజిటెబుల్ సూప్ ... మ‌ధ్యాహ్య‌నం 01.30 గంట‌ల‌కు 200 గ్రాముల చికెన్‌, బ్రౌన్ రైస్‌, 1/2 క‌ప్పు వెబుట‌బుల్ క‌ర్రీ.. 4 గంట‌ల‌కు 250 గ్రామ‌లు గ్రిల్డ్‌ఫిష్ క‌ర్రీ, 200 గ్రాముల స్వీట్ పోటాటో, అర‌క‌ప్పుడు ఉడికించిన కాయ‌గూర‌లు.. సాయంత్రం 6 గంట‌ల‌కు పెద్ద క‌ప్పు గ్రీన్ స‌లాడ్‌, పావుక‌ప్పు అవ‌కాడో ఫ్రూట్‌ను తీసుకునేవాడ‌ట‌.

చెర్రీ. మ‌ధ్య‌లో ఆకలేస్తే బాదం వంటి న‌ట్స్‌ను ఆహారంగా తీసుకునేవాడ‌ట‌. అలాగే  ఈ క్ర‌మంలో చ‌ర‌ణ్ కాఫీ, టీ స‌హా పాల‌తో త‌యారైన ప‌దార్థాల‌ను , రెడ్ మీట్‌, మాసం, షుగ‌ర్ ఫ్రూట్స్ వంటి ప‌దార్థాల‌ను తీసుకోలేద‌ట‌. 

More News

బాలీవుడ్‌లోకి మ‌రో విజ‌య్ దేవ‌రకొండ‌ చిత్రం...

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు పిచ్చ క్రేజ్ ఉంది. వ‌రుస సినిమాల‌తో స‌క్సెస్‌ఫుల్ ట్రాక్‌లో దూసుకెళ్తున్నాడీ కుర్ర హీరో. విజ‌య్ దేవ‌ర‌కొండ గాలి ఏకంగా బాలీవుడ్ రేంజ్‌లో వీస్తుంది.

సింగ‌ర్‌ను పెళ్లి చేసుకోనున్న తేజ హీరోయిన్‌

హీరోయిన్స్ సోన‌మ్ క‌పూర్‌, దీపికా ప‌దుకొనే, ప్రియాంక చోప్రా.. ఇలా హీరోయిన్స్ అంద‌రూ పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. వీరి బాట‌లోనే పెళ్లి చేసుకోబోతుంది మ‌రో హీరోయిన్‌.

రోమియో ప్ర‌భాస్‌

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా 20వ చిత్రం ..'జిల్' ఫేమ్ రాధాకృష్ణ‌కుమార్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పీరియాడిక్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్క‌నుంది.

రెండు కోట్ల సెట్‌.. రెండు నిమిషాలు..

22 ఏళ్ల త‌ర్వాత క‌మ‌ల్‌ హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'ఇండియ‌న్ 2'. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఓ భారీ సెట్‌ను 2 కోట్ల వ్య‌యంతో నిర్మిస్తున్నార‌ట‌.

'వైదేహి' ట్రైల‌ర్ లాంచ్‌

యాక్టివ్ స్టూడియోస్ ప‌తాకంపై ఎ.జి.ఆర్‌. కౌశిక్ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతున్న చిత్రం `వైదేహి`. ఎ.జ‌న‌నీ ప్ర‌దీప్ నిర్మాత‌. ఎ.రాఘ‌వేంద్ర‌ప్ర‌దీప్ ద‌ర్శ‌కుడు. ఈయ‌న దివంగ‌త న‌టుడు ఏవీయ‌స్ త‌న‌యుడు.