‘ఆచార్య’ కోసం చ‌ర‌ణ్ ఏం చేస్తున్నాడో తెలుసా?

  • IndiaGlitz, [Tuesday,September 29 2020]

గ‌త ఏడాది ‘సైరా న‌ర‌సింహారెడ్డి’తో మెగాభిమానుల‌ను అల‌రించాల‌ని అనుకున్న మెగాస్టార్ చిరంజీవికి అంత స్కోప్ లేకుండా పోయింది. తాజాగా ఇప్పుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ‘ఆచార్య‌’తో అయినా 2020లో బాక్సాఫీస్ వ్ద‌ద సెన్సేష‌న్ క్రియేట్ చేయాల‌ని మెగాస్టార్ భావించారు. కానీ క‌రోనా వైర‌స్ మెగా స్పీడుకి బ్రేకులేసింది. ‘ఆచార్య‌’ విడుద‌ల ఈ ఏడాది లేదు. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయాలని చూస్తున్నారు. వచ్చే నెలలో సినిమా షూటింగ్‌ను రీస్టార్ట్ చేయడానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ షెడ్యూల్‌లో ముందుగా రామ్‌చ‌ర‌ణ్‌పై స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్నార‌ట‌. ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ న‌క్స‌లైట్ లీడ‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తార‌ని స‌మాచారం. ఈ సినిమా కోసం రామ్‌చ‌ర‌ణ్ ఓ ప‌నిచేయ‌బోతున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. అదేంటంటే ఆచార్యలో పాత్ర కోసం బ‌రువు పెరుగుతున్నాడ‌ట‌. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప‌ర్‌ఫెక్ట్ లుక్‌లో క‌న‌ప‌డిన చ‌ర‌ణ్, ట్రిపుల్ ఆర్‌ను పూర్తి చేసి ఆచార్య సినిమాలో జాయిన్ అవుదామ‌ని అనుకున్నాడు. కానీ ట్రిపుల్ ఆర్ ఇప్ప‌ట్లో స్టార్ట్ అయ్యేలా క‌న‌ప‌డ‌టం లేదు. మ‌రో వైపు ఆచార్య యూనిట్ త‌న కోసం వెయిటింగ్‌లో ఉన్నారు. అందుకోసం చ‌ర‌ణ్.. జ‌క్క‌న్న ప‌ర్మిష‌న్ తీసుకుని ఆచార్య షూటింగ్‌ను పూర్తి చేసే ప‌నిలో ప‌డ్డాడు. అందు కోసం బ‌రువు పెరుగుతున్నాడని స‌మాచారం. ఆచార్య పూర్తి కాగానే మ‌ళ్లీ బ‌రువు త‌గ్గాల్సి ఉంటుంది చ‌ర‌ణ్‌.

More News

డ్రగ్స్ కేసులో మళ్లీ హీరోయిన్ల విచారణ.. హీరోల వంతూ వచ్చేసింది!

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరోసారి స్టార్ హీరోయిన్లను విచారించేందుకు ఎన్సీబీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

సోనూసూద్‌కు ఐక్య‌రాజ్య‌స‌మితి అవార్డ్‌

సినిమాల్లో విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన బాలీవుడ్ న‌టుడు సోనూసూద్

నిశ్శ‌బ్ధం లో క‌థ‌లో ప్ర‌తి పాత్ర ఆస‌క్తిక‌రంగా ఉంటాయి - అనుష్క‌

భాగ‌మ‌తి త‌రువాత కావాల‌ని గ్యాప్ తీసుకున్నా, ఆ స‌మయంలో కోన‌వెంక‌ట్ గారు, హేమంత్ గారితో ఈ స్టోరీ నెరేష‌న్ ఇప్పించారు,

‘ఆదిపురుష్‌’... అనుష్క క్లారిటీ..!

ప్యాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్..బాహుబ‌లి త‌ర్వాత ప్యాన్ ఇండియా స్టార్‌గా ప్ర‌భాస్ వ‌రుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

దుబ్బాక ఉప ఎన్నికకు షెడ్యూల్.. వ్యూహాలకు పదును పెడుతున్న పార్టీలు

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక నిర్వహణకు మంగళవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌‌ను రిలీజ్ చేసింది.