రామ్‌చ‌ర‌ణ్‌కి ఏమీ కాలేదు

  • IndiaGlitz, [Wednesday,July 24 2019]

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌కు 'RRR' షూటింగ్‌లో మ‌ళ్లీ గాయ‌మైందంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపించాయి. అయితే అలాంటిదేమీ లేద‌ని, ఆయ‌న 'RRR'షూటింగ్‌లో కూడా పాల్గొన్నార‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు తెలియ‌జేశాయి. ఇటీవ‌ల రామ్‌చ‌ర‌ణ్ జిమ్ చేస్తుండగా కాలికి గాయ‌మైంది. దాంతో 'RRR' షూటింగ్ మూడు వారాల పాటు వాయిదా ప‌డింది. మ‌ళ్లీ ఇప్పుడు మ‌రోసారి గాయ‌మైందా? అని మెగాభిమానులు కంగారు ప‌డ్డారు. అయితే చ‌ర‌ణ్ స‌న్నిహిత వ‌ర్గాలు ఆ వార్త‌ల‌ను కొట్టిపారేశాయి.

రూ.300కోట్ల పైగా భారీ బడ్జెట్‌తో డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తోన్న ఈ సినిమాను రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో క‌నిపిస్తే.. ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర‌లో క‌నిపిస్తారు. అజ‌య్‌దేవ‌గ‌ణ్‌, అలియా భ‌ట్, స‌ముద్ర‌ఖ‌ని త‌దిత‌రులు కీలక పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

More News

కుప్పకూలిన కుమారన్న సర్కార్..

కన్నడనాట బలపరీక్షలో కుమారన్న సర్కార్ కుప్పకూలిపోయింది. ఓటింగ్‌లో కుమారస్వామి ప్రభుత్వం ఓడిపోయింది.

మీ కూతుళ్లను చూసి నేర్చుకోవాలి జగనన్నా: రోజా

మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే మహిళలకు చారిత్రాత్మక బిల్లులను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఎమ్మెల్యే రోజా కృతజ్ఞతలు తెలిపారు.

అగస్ట్ 9 న అనసూయ 'కథనం'

అనసూయ ప్రధాన పాత్రలో రాజేష్‌ నాదెండ్ల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కథనం'.. ది గాయ‌త్రి ఫిల్మ్స్ ,

'వాల్మీకి'.. సెప్టెంబ‌ర్ 13న రిలీజ్‌

కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్య‌మైన క‌థా చిత్రాల్లో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపించిన క‌థానాయ‌కుడు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌.

మోదీ మెచ్చిన ఈ బుడ్డోడు ఎవరబ్బా!?

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ బిజిబిజీగా ఉంటారన్న విషయం తెలిసిందే. మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులతో మీటింగ్‌లు, విదేశీ పర్యటనలు