చ‌ర‌ణ్ త‌దుప‌రి ద‌ర్శ‌కుడు అత‌నేనా?

  • IndiaGlitz, [Saturday,March 28 2020]

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా ‘రౌద్రం ర‌ణం రుధిరం’లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్ ఏ సినిమా చేయ‌బోతున్నాడ‌నే దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ సినిమా చేస్తున్నాడ‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అయితే తాజాగా సామాజిక మాధ్యమాల్లో మ‌రో వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. అదేంటంటే క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను డైరెక్ట్ చేసే అనీల్ రావిపూడి .. చ‌ర‌ణ్‌తో సినిమా చేస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

ఈ ఏడాది జూన్ వ‌ర‌కు రామ్‌చ‌ర‌ణ్ మ‌రో సినిమా గురించి ఆలోచించే అవ‌కాశం లేదు. ‘ఆర్ఆర్ఆర్‌’ సినిమా పూర్త‌యిన త‌ర్వాతే చ‌ర‌ణ్ నెక్ట్స్ సినిమా ఆలోచ‌న‌లు చేస్తాడ‌ట‌. చ‌ర‌ణ్ తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్‌’ క‌రోనా వైర‌స్ ప్ర‌భావం కార‌ణంగా షూటింగ్ ఆగింది. ఇప్ప‌టికే 75 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 8న సంక్రాంతి సంద‌ర్భంగా సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఆలియా భ‌ట్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

More News

రాజ‌మౌళి చిత్రంలో మ‌రో సూపర్ స్టార్ ?

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ల‌తో తెర‌కెక్కిస్తోన్న భారీ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)’. ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌గా

తార‌క్ అన్నీ భాష‌ల్లో డ‌బ్బింగ్ చెబుతాడు..!

‘రౌద్రం ర‌ణం రుధిరం’ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. అందుకు ప్ర‌త్యేక కార‌ణాలు చెప్ప‌న‌క్క‌ర్లేదు. ‘బాహుబ‌లి’ సినిమా త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది.

ఇండియాలో ఫస్ట్ టైమ్ కోవిడ్-19 మైక్రోస్కోపీ చిత్రం

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. అక్కడెక్కడో చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్ ప్రపంచాన్ని గడగడ లాడిస్తోంది. మరోవైపు చైనా, అమెరికా, ఇటలీ లాంటి దేశాల్లో రోజురోజుకూ కరోనా

లాక్‌డౌన్ పొడిగిస్తున్నాం.. ఇళ్లలో నుంచి బయటికి రాకండి : కేసీఆర్

తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగిస్తున్నామని.. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు ఏప్రిల్-15 వరకు ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ మీడియా మీట్ నిర్వహించిన ఆయన..

అదంతా ఫేక్.. ఈ ఫుడ్ తింటే కరోనా ఖతం: కేసీఆర్

కరోనా వైరస్ భయంతో ప్రజలు అందరూ అల్లాడుతున్న వేళ తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని ఆరోగ్య చిట్కాలు చెప్పారు. శుక్రవారం నాడు మీడియా మీట్ నిర్వహించిన