చ‌ర‌ణ్ షెడ్యూల్ షురూ!

  • IndiaGlitz, [Tuesday,September 04 2018]

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. అందులో భాగంగా ప్ర‌స్తుతం యూనిట్ అంతా అజ‌ర్‌బైజాన్‌కు చేరుకుంది. సెప్టెంబ‌ర్ 3 నుండి య‌దావిధిగా ప్లానింగ్ ప్ర‌కారం షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

ఈ షెడ్యూల్ 25 రోజుల పాటు జ‌ర‌గ‌బోతోంది. రామ్‌చ‌ర‌ణ్‌, కియరా అద్వాని స‌హా యూనిట్‌పై కీల‌క సన్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్నారు. రీసెంట్‌గా హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో వేసిన సెట్‌లో యాక్ష‌న్ సీన్స్‌ను చిత్రీక‌రించారు. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు. ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేశ్‌, వివేక్ ఒబెరాయ్‌, స్నేహ, అన‌న్య త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ధారులు.