కాశ్మీర్ లో రామ్ చరణ్...

  • IndiaGlitz, [Tuesday,April 19 2016]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌ని ఓరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ధృవ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ మూవీలో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది.
ఈ నెలాఖ‌రు నుంచి కాశ్మీర్ లో షూటింగ్ చేయ‌నున్నారు. ఈ షెడ్యూల్ లో రామ్ చ‌ర‌ణ్ - ర‌కుల్ ప్రీత్ సింగ్ పై కొన్ని సీన్స్, ఓ సాంగ్ చిత్రీక‌రించ‌నున్నారు. త‌ని ఓరువ‌న్ లో న‌టించిన అర‌వింద్ స్వామి ఈ చిత్రంలో కూడా సేమ్ క్యారెక్ట‌ర్ పోషిస్తుండ‌డం విశేషం. ఈ చిత్రంలో నాజ‌ర్, పోసాని కృష్ణ‌ముర‌ళీ ముఖ్య‌పాత్ర‌లు పోషిస్తున్నారు. మ‌గ‌థీర త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ - అల్లు అర‌వింద్ కాంబినేష‌న్లో రూపొందుతున్న‌ధృవ ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టిస్తుందో చూడాలి.

More News

వ‌రుణ్ తేజ్ - శ్రీను వైట్ల మూవీ టైటిల్ ఇదే..

వ‌రుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని ల‌క్ష్మీ న‌ర‌సింహా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై న‌ల్ల‌మ‌లుపు బుజ్జి, ఠాగూర్ మ‌ధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మిస్ట‌ర్ అనే టైటిల్ ఖ‌రారు చేసారు.

మ‌హేష్ రికార్డ్ క్రాస్ చేయ‌నున్న నాగ్

టాలీవుడ్ కింగ్ నాగార్జున సూప‌ర్ స్టార్ మ‌హేష్ రికార్డ్ క్రాస్ చేయ‌డ‌మా..? ఇంత‌కీ ఆ రికార్డ్ ఏమిటి అనుకుంటున్నారా..? యు.ఎస్ లో మ‌హేష్ సినిమాలు శ్రీమంతుడు రెండో స్ధానంలో, సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు ఐద‌వ స్ధానంలో,దూకుడు ఆర‌వ స్ధానంలో ఉన్నాయి.

ఆ ముగ్గురులో ఎవ‌రు బెస్ట్ అనేది చెప్ప‌డం చాలా క‌ష్టం - హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్

వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయిక ర‌కుల్ ప్రీత్ సింగ్. ఆత‌ర్వాత లౌక్యం, క‌రెంట్ తీగ‌, పండ‌గ చేస్కో, కిక్ 2 బ్రూస్ లీ, నాన్న‌కు ప్రేమ‌తో...త‌దిత‌ర చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ర‌కుల్ తాజాగా న‌టించిన చిత్రం స‌రైనోడు.

మహేష్ సరికొత్త రికార్డ్...

సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పివిపి బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం బ్రహ్మోత్సవం.ఈ సినిమా మే1న ఆడియో విడుదల జరుపుకోనుంది.

యు.ఎస్. లో నారా రోహిత్ 'రాజా చెయ్యి వెస్తే' హల్ చల్

తన నటన,డైలాగ్ డెలివరీతో తొలి సినిమా బాణం సినిమా నుండి నేటి వరకు డిఫరెంట్ గా చేస్తూ తన ప్రత్యేకతను క్రియేట్ చేసుకుంటూ యూత్ లో,ప్యామిలీ ఆడియెన్స్ ఓ క్రేజ్ ను సంపాదించుకున్న హీరో నారారోహిత్ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం' రాజా చెయ్యివేస్తే'.