మళ్ళీ రాజమండ్రి వెళుతున్న చరణ్

  • IndiaGlitz, [Thursday,May 18 2017]

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్ 1 నుండి రాజమండ్రి ప‌రిస‌రాల్లో ఇంత వ‌ర‌కు ఎవ‌రూ చిత్రీక‌రించ‌ని నేచుర‌ల్ లోకేష‌న్స్‌లో మొద‌టి షెడ్యూల్‌ను పూర్తి చేశారు.ఆరు గంట‌ల‌కు షూటింగ్ అంటే అంద‌రూ ఐదు గంటల‌కే లోకేష‌న్‌లో ఉండేవారు. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, హీరోయిన్ స‌మంత స‌హా అంద‌రూ ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. అంద‌రి స‌హ‌కారంతో మొద‌టి షెడ్యూల్‌ను అనుకున్న ప్లాన్ ప్ర‌కారం పూర్తి చేశాం. ఔట్ అండ్ ఔట్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో హీరో రామ్ చ‌ర‌ణ్ త‌న పాత్ర‌ను ఛాలెంజింగ్‌గా తీసుకుని న‌టించారు. అనుకున్న విధంగా సినిమా మంచి అవుట్‌పుట్‌తో రావ‌డం ఎంతో ఆనందంగాఉంద‌ని నిర్మాత‌లు తెలిపారు.

మే 9 నుండి హైద‌రాబాద్‌లో రెండ‌వ షెడ్యూల్ ప్లాన్ చేశారు. హైద‌రాబాద్‌తో పాటు రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల్లో మ‌రో షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. అయితే రాజ‌మండ్రిలో 45 నుండి 47 డిగ్రీల అమిత‌మైన ఉష్ణోగ్ర‌త‌ల కార‌ణంగా, మొద‌టి షెడ్యూల్‌లో స‌మంత‌కు వ‌డ‌దెబ్బ త‌గ‌ల‌డంతో ముందుగా జ‌ర‌గాల్సిన రాజ‌మండ్రి షెడ్యూల్‌ను న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్మాత‌లు పోస్ట్‌పోన్ చేశారు.

ఇప్పుడు చిత్ర‌యూనిట్ జూన్ 1 నుండి రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల్లో ఏక‌ధాటిగా చిత్రీక‌ర‌ణ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. గోదావ‌రి న‌ది ఒడ్డున భారీ సెట్ వేసి అందులో హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌ను షూట్ చేయ‌నున్నారు. అలాగే హైద‌రాబాద్‌లో సెట్స్ వేసి చిత్రీక‌రణ చేస్తారు. మెగాభిమానుల‌ను, ప్రేక్ష‌కుల‌కు బెస్ట్ అవుట్‌పుట్‌తో సినిమాను అందించ‌డానికి చిత్ర నిర్మాత‌లు య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, న‌వీన్ ఎర్నేని, మోహ‌న్‌(సివిఎం)లు అందిస్తున్నారు. అలాగే ఆగ‌స్టులో సినిమా విడుద‌ల తేదిని కూడా ప్ర‌క‌టిస్తారు. ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌కాష్ రాజ్‌, ఆది త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

More News

మూడోసారి హిట్ ద్వయం..

ప్రస్తుతం సూపర్స్టార్ మహేష్ తో సినిమా చేస్తున్న ఎ.ఆర్.మురుగదాస్ తదుపరి సినిమా ఎవరితో

వనపర్తి హజ్రత్ సయ్యద్ రాజావలి దర్గాను సందర్శించిన నవీన్ విజయ్ కృష్ణ

ప్రముఖ మహిళా దర్శకురాలు శ్రీమతి విజయ నిర్మల మనవడు , సినీ హీరో డాక్టర్ నరేష్ విజయ కృష్ణ కుమారుడు నవీన్ విజయ కృష్ణ తెలంగాణ లోని వనపర్తి జిల్లా అమరచింత గ్రామంలోని హజ్రత్ సయ్యద్ రాజా వలి దర్గా షరీఫ్ 406 ఉరుసు ఉత్సవాలలో పాల్గొనటానికి అల్ ఇండియా కృష్ణ మహేష్ ప్రజా సేన అధ్యక్షులు మహమ్మద్ ఖాదర్ ఘోరీ ఆహ్వానం మేరకు ఆదివారం రావా వాలి దర్గా ను

మరోసారి తల్లికి బిడ్డగా నటిస్తుంది...

ఒకప్పుడు హీరోయిన్స్ అంటే హీరో పక్కన గ్లామర్ తో పాటు పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ కు ప్రాధాన్యత ఇచ్చేవారు.

హీరో సుశాంత్ కు పితృ వియోగం

టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఇంట్లో విషాదం నెలకొంది.

మంచి కథతో వస్తే ఇతరుల డైరెక్షన్ లో కూడా సినిమాను నిర్మిస్తాను : పోలిచర్ల హరనాథ్

గతంలో హోప్, చంద్రహాస్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన నటుడు, నిర్మాత, దర్శకుడు పోలిచర్ల హరనాథ్ తాజాగా నటిస్తూ దర్శకనిర్మాతగా రూపొందించిన చిత్రం ‘టిక్ టాక్’.