మెగా క‌లయిక‌.. చ‌ర‌ణ్‌‌తో ప్ర‌శాంత్ నీల్ మూవీ

వరుస సినిమాలను పట్టాలెక్కించే పనిలో బిజీగా వున్నారు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్. ఈ కోవలో మెగా అభిమానులకు దసరా రోజున అదిరిపోయే కానుకలు వచ్చాయి. ఉదయం ఏమోషనల్ డ్రామాల స్పెషలిస్ట్‌ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయగా... ఆ కొద్దిసేపటికే మరో క్రేజీ కాంభినేషన్‌కు సంబంధించిన న్యూస్‌ను పంచుకున్నారు చరణ్.

‘కేజీఎఫ్’ సినిమాతో భారతదేశం దృష్టిని ఆకర్షించి.. భారీ ఎలివేషన్ సీన్స్‌తో హీరోల మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారారు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆ మూవీకి సీక్వెల్‌గా కేజీఎఫ్‌ తీసిన ఆయన.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో యాక్షన్ డ్రామా ‘సలార్’ తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్తోనూ ఓ సినిమా కమిటయ్యారు.

తాజాగా ప్రశాంత్నీల్.. మెగా పవర్ స్టార్ రామ్చరణ్, మెగాస్టార్ చిరంజీవిని దసరా పండుగ రోజు కలవడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. చ‌ర‌ణ్‌.. ప్ర‌శాంత్ నీల్‌ని త‌న ఇంటికి ఆహ్వానించ‌గా ఆ స‌మ‌యంలో చిరంజీవితో క‌లిసి ప్రశాంత్ నీల్‌, చ‌ర‌ణ్ గ్రూప్ ఫొటో దిగారు. ఈ ఫోటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. చిరుని క‌ల‌వ‌డంతో చిన్న‌నాటి క‌ల నెర‌వేరిన‌ట్టుగా తెలియ‌జేశాడు. అయితే రామ్‌చరణ్‌‌తో ప్రశాంత్ నీల్ ఓ సినిమా పట్టాలెక్కించబోతున్నారని.. ప్రశాంత్ చెప్పిన కథ నచ్చడంతో చెర్రీ ఓకే చెప్పారని ఫలింనగర్ టాక్. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం వుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి వుంది.

More News

మెడలో మంగళసూత్రం, నుదుట సింధూరం, స్నేహా ఉల్లాల్ ఫోటోలు వైరల్

నీలిరంగు కళ్లు, వైట్ స్కిన్ టోన్, కట్టిపడేసే చిరునవ్వుతో జూనియర్ ఐశ్వర్యరాయ్‌గా గుర్తింపు తెచ్చుకుంది స్నేహా ఉల్లాల్. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ చిత్రంతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైన స్నేహకు

బిగ్‌బాస్ 5 తెలుగు: ఈ వారం వరస్ట్ పెర్ఫామర్ గా జైలుకెళ్లిందెవరంటే…?

బిగ్‌బాస్ 5 తెలుగు ఐదో వారం ఎండింగ్‌కు వచ్చేసింది. ఇప్పటికే బొమ్మల టాస్క్‌తో ఇంటి సభ్యుల మధ్య వివాదం రచ్చకెక్కింది. ప్రియా బూతులు, యానీ మాస్టర్- శ్వేతా ఫైట్‌ ఎలా నడిచిందో చూశారు.

విడాకుల తర్వాత తొలి సినిమా అనౌన్స్‌మెంట్.. పోస్టర్‌లో డల్‌గా సమంత...!!

సమంత-నాగచైతన్య విడాకుల షాక్ నుంచి సినీ పరిశ్రమ, ప్రజలు ఇంకా తేరుకోలేదు. ఆమెకు సంబంధించిన ఏ చిన్న వార్త వచ్చినా అది ప్రస్తుతం వైరలయి కూర్చొంటోంది.

మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్: 35 రోజుల తర్వాత ఇంటికొచ్చిన సాయితేజ్.. డిశ్చార్జ్‌, బర్త్‌డే ఒకేసారి

పండగపూట మెగా అభిమానులకు గుడ్‌న్యూస్ అందింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇన్ని రోజులు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందిన హీరో సాయిధరమ్‌ తేజ్‌ శుక్రవారం

దసరాకు 'జీ 5'లో విడుదలైన 'రాజ రాజ చోర'కు హిట్ టాక్

'జీ 5'లో 'రాజ రాజ చోర' విడుదలైన వెంటనే సామాజిక మాధ్యమాల్లో హీరో శ్రీవిష్ణు, హీరోయిన్లు సునైనా, మేఘా ఆకాష్ నటనను ప్రశంసిస్తూ...