close
Choose your channels

రాంచరణ్ రూ.25 లక్షలు గెలుచుకున్నాడా.. కేవలం రెండడుగుల దూరంలో

Thursday, July 29, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రాంచరణ్ రూ.25 లక్షలు గెలుచుకున్నాడా.. కేవలం రెండడుగుల దూరంలో

మెగా పవర్ స్టార్ రాంచరణ్ రూ 25 లక్షలు గెలుచుకున్నాడు అనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అదేంటి రాంచరణ్ దగ్గర లేని డబ్బా.. అందులోని ప్రతి చిత్రానికి కోట్లల్లో రెమ్యునరేషన్ అందుకునే చరణ్.. కేవలం 25లక్షలు గెలుచుకోవడం ఏంటి అనే అనుమానం కలగొచ్చు. తప్పకుండా చరణ్ గెలుచుకున్న ఈ 25 లక్షలు చాలా స్పెషల్.

వివరాల్లోకి వెళితే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఓ పాపులర్ ఛానల్ 'మీలో ఎవరు కోటీశ్వరులు' అనే షోని టెలికాస్ట్ చేయబోతోంది. బిగ్ బి అమితాబ్ కౌన్ బనేగా కరోడ్పతి స్పూర్తితో ఈ షో నిర్వహిస్తున్నారు. ప్రతి కరెక్ట్ సమాధానానికి గెలుచుకునే మొత్తం డబుల్ అవుతూ ఉంటుంది.

ఈ షోలో మొట్టమొదటి ఎపిసోడ్ కి గెస్ట్ గా ఎన్టీఆర్ ముందు రాంచరణ్ హాజరయ్యాడు. ఈ ఎపిసోడ్ ని ఆగష్టు 16న టెలికాస్ట్ చేయనున్నారు. షూటింగ్ పూర్తయింది. ఈ షోలో రాంచరణ్ రూ 25 లక్షలు గెలుచుకున్నాడట. పూర్తి స్థాయి విజయానికి చరణ్ కేవలం రెండడుగుల దూరంలో నిలిచిపోయాడు. లేకుంటే రాంచరణ్ కోటి రూపాయలు గెలుచుకునేవాడు.

ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసమే తొలి ఎపిసోడ్ లో రాంచరణ్ హాజరయ్యాడు. ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ ఒకే స్క్రీన్ పై బుల్లితెరపై కనిపిస్తే ఫ్యాన్స్ కి ఆ మజానే వేరు. జక్కన్న ఆర్ఆర్ఆర్ లో వీరిద్దరూ బిగ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరులు 16 ఎపిసోడ్స్ షూటింగ్ పూర్తయింది. ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి చేసుకుని ఎన్టీఆర్ తిరిగి వచ్చాక మిగిలిన ఎపిసోడ్స్ పూర్తి చేయనున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.