కన్నడ బ్యూటీతో రామ్?

  • IndiaGlitz, [Wednesday,January 03 2018]

కిరిక్ పార్టీ సినిమాతో క‌న్న‌డ నాట సంచ‌ల‌నం సృష్టించింది ర‌ష్మిక మంద‌న్న‌. ఆ సినిమా కేవ‌లం క‌న్న‌డ సీమ‌లోనే కాదు తెలుగు ప‌రిశ్ర‌మ‌లోనూ ర‌ష్మిక‌కి అవ‌కాశాలు క‌ల్పించింది. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ నాగ‌శౌర్యతో ఛ‌లో చిత్రం చేస్తోంది. అలాగే అర్జున్ రెడ్డి క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ప‌రుశురామ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న గీతాగోవింద‌లోనూ క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

తాజాగా వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. ర‌ష్మిక‌కి మ‌రో మంచి ఆఫ‌ర్ ద‌క్కింద‌ని తెలిసింది. రామ్ క‌థానాయ‌కుడిగా త్రినాథ రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రంలో ఓ హీరోయిన్‌గా న‌టించే ఛాన్స్ ర‌ష్మిక కొట్టేసింద‌ని స‌మాచార‌మ్‌. ఇప్ప‌టికే ఈ సినిమా విష‌యంలో కీర్తి సురేష్‌, నివేదా థామ‌స్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ వంటి పేర్లు వార్త‌ల్లో వినిపించిన సంగ‌తి తెలిసిందే. మ‌రి ర‌ష్మిక కూడా వార్త‌ల‌కే ప‌రిమిత‌మ‌వుతుందో లేదంటే రామ్ స‌ర‌స‌న న‌టించి మురిపిస్తుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

More News

'అర్జున్ రెడ్డి' దర్శకుడి రెండో చిత్రం అప్ డేట్స్...

'అర్జున్ రెడ్డి' సినిమా ఎంత సంచలనమో..

'బటర్ ప్లయిస్' థియేటర్ ట్రైలర్ విడుదల

'బటర్ ప్లయిస్' థియేటర్ ట్రైలర్ విడుదల రామసత్యనారాయణ  భీమవరం టాకీస్ పై 92 వ చిత్రంగా 'బటర్ ప్లెయిస్'  చిత్రాన్ని నిర్మిస్తున్నారు‌ . కె. R.ఫణిరాజ్ దర్శకత్వం వహిస్తొన్న ఈ సినిమాలొ అందరు ఆడవాళ్లె నటిస్తుండటం విశేషం.

'ఇంద్ర', 'అజ్ఞాతవాసి'.. కొన్ని కామన్ పాయింట్స్

కొన్ని విషయాలు యాదృచ్ఛికంగా జరిగినా భలే సరదాగా,గమ్మత్తుగా ఉంటాయి.

మ‌ళ్ళీ దేవిశ్రీ ప్ర‌సాద్‌తోనే..

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, మాస్ చిత్రాల ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రి 19 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

రాజ్‌ తరుణ్‌ 'రంగుల రాట్నం' ఈ సంక్రాంతి రిలీజ్‌కి రెడీ అవుతోంది

2017లో 'రారండోయ్‌ వేడుక చూద్దాం', 'హలో' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను అందించిన అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మించిన 'రంగుల రాట్నం' చిత్రం ఈ సంక్రాంతి రిలీజ్‌కి రెడీ అవుతోంది. రాజ్‌ తరుణ్‌, చిత్రా శుక్లా జంటగా నటించిన ఈ చిత్రానికి శ్రీరంజని దర్శకత్వం వహిస్తున్నారు.