రైట‌ర్‌గా మారుతున్న ర‌మా రాజ‌మౌళి?

  • IndiaGlitz, [Monday,August 17 2020]

ప్యాన్ ఇండియా డైరెక్ట‌ర్ రాజ‌మౌళి స‌తీమ‌ణి ర‌మా రాజ‌మౌళి ఆయ‌న సినిమాల‌కు కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే లేటెస్ట్‌గా ఈమె రైట‌ర్‌గా మారుతున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. వివ‌రాల్లోకెళ్తే.. ప్ర‌స్తుతం డైరెక్ట‌ర్ రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)’. ఈ సినిమాకు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన ర‌మారాజ‌మౌళి ఇప్పుడు రైట‌ర్‌గా మారార‌ని, కొన్ని కీల‌క స‌న్నివేశాల‌కు ఆమె సంభాష‌ణ‌లు అందించార‌ని వార్త‌లు వినిపించాయి. అయితే ఈ వార్త‌ల్లో ఏమాత్రం నిజం లేద‌ని కొందరి వాద‌న‌. ఎందుకంటే.. రాజ‌మౌళి ఔట్‌పుట్ విష‌యంలో అంత ఈజీగా మ‌రొక‌రిని ఇన్‌వాల్వ్ చేయ‌నివ్వ‌డు. అలాంటి స‌మ‌యంలో ర‌మా రాజ‌మౌళికి రైటింగ్ విభాగంలో ఎందుకు స్పేస్ ఇస్తాడ‌నేది టాక్‌.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా దాన‌య్య నిర్మాత‌గా రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న పేట్రియాటిక్ మూవీ ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)’. అజయ్ దేవగణ్, ఆలియా భ‌ట్ వంటి బాలీవుడ్ స్టార్స్ తో పాటు రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడీ వంటి హాలీవుడ్ తార‌లు న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే సినిమా ఎన‌బై శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. క‌రోనా వైర‌స్ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డ త‌ర్వాత సినిమా షూటింగ్ షురూ అవుతుంది.

More News

నాన్నగారికి ప్రమాదమేమీ లేదని వైద్యులంటున్నారు: ఎస్పీ చరణ్

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఆయన తనయుడు చరణ్ తాజా అప్‌డేట్ ఇచ్చారు.

కులంపై రామ్ ట్వీట్‌

తాను ఇక ట్వీట్స్ చేయ‌న‌ని చెప్పిన రామ్ ఆ మాట చెప్పి ఇర‌వై నాలుగు గంట‌లు గ‌డ‌వ‌క ముందే ట్వీట్ పెట్టారు.

సందీప్‌ కిషన్‌ నిర్మాతగా ‘వివాహ భోజనంబు’

యువ కథానాయకుడు సందీప్‌ కిషన్‌లో అభిరుచి గల నిర్మాత, మంచి భోజన ప్రియుడు ఉన్నారు. ప్రజలకు రుచికరమైన భోజనం,

మ‌రోసారి ఆయ‌న‌కే ఓటేసిన క్రిష్‌..!!

లాక్‌డౌన్ స‌మ‌యంలో ద‌ర్శ‌క నిర్మాత క్రిష్ ఖాళీగా ఉన్నాడు. అయితే ఈ ఖాళీ స‌మ‌యాన్ని క్రిష్ ఏమాత్రం వేస్ట్ చేయ‌లేదు.

‘రాధేశ్యామ్’ ప్లానింగ్ అలా చేశారా?

యంగ్ రెబల్‌స్టార్ ప్ర‌భాస్ ప్యాన్ ఇండియా అయిన‌ప్ప‌టి నుండి ఆయ‌న సినిమాల‌పై చాలా ఫోక‌స్ పెరిగింది.