రమేష్ ప్రసాద్గారికి సతీ వియోగం
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నిర్మాత, ప్రసాద్ గ్రూప్ (ఐమ్యాక్స్, ప్రసాద్ లాబ్స్) చైర్మన్ అక్కినేని రమేష్ ప్రసాద్ గారి సతీమణి, శ్రీమతి అక్కినేని విజయలక్ష్మి గురువారం ఉదయం పరమపదించారు. హార్ట్ ఎటాక్ కారణంగా రాత్రి నిద్రలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 77 సంవత్సరాలు. ఆమె మద్రాసులో జన్మించారు. రమేష్ ప్రసాద్ గారితో 1963 జూలైలో వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు జూబ్లీహిల్స్ ఫిలింనగర్ సమీపంలోగల మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విజయలక్ష్మి గారి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.