రానా ద‌గ్గుబాటి, సాయిప‌ల్ల‌వి 'విరాట‌ప‌ర్వం' ప్రారంభం

  • IndiaGlitz, [Saturday,June 15 2019]

రానా ద‌గ్గ‌బాటి, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న చిత్రం 'విరాట‌ప‌ర్వం'. ఈ చిత్రం శ‌నివారం హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి విక్ట‌రీ వెంక‌టేశ్ క్లాప్ కొట్ట‌గా, ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాతలు డి.సురేష్ బాబు, సుధాక‌ర్ చెరుకూరి ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల‌కి స్క్రిప్ట్‌ను అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో రానా ద‌గ్గుబాటి, సాయిప‌ల్ల‌వి పాల్గొన్నారు.

వ‌చ్చే వారం నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుగుతుంది. వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతాన్ని, దివాక‌ర్ మ‌ణి సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్‌.ఎల్‌.పి ప‌తాకాల‌పై సురేష్ బాబు, సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

విక్ట‌రీ వెంక‌టేశ్‌, రానా ద‌గ్గ‌బాటి, డి.సురేష్ బాబు, సుధాక‌ర్ చెరుకూరి, సాయిప‌ల్ల‌వి, ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి, నిర్మాత‌లు న‌వీన్ ఎర్నేని, మోహ‌న్ చెరుకూరి, వై. ర‌విశంక‌ర్‌, సాహు గార‌పాటి, అభిషేక్ అగ‌ర్వాల్‌, రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట‌, డైరెక్ట‌ర్స్ చందు మొండేటి, అజయ్ భూప‌తి, వెంక‌టేశ్ మ‌హా, ఏషియ‌న్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ త‌దిత‌రులు అతిథులుగా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

న‌టీనటులు: రానా ద‌గ్గుబాటి, సాయిప‌ల్ల‌వి త‌దిత‌రులు

More News

'కిల్లర్' విజయం అరుదైనది - అర్జున్

ఆండ్య్రూ లూయిస్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోని, యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ కలిసి నటిస్తున్న చిత్రం 'కొలైగారన్‌'..

టీడీపీ ఘోర ఓటమికి కారణాలివే.. కుండ బద్ధలు కొట్టిన నేతలు

ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీ ఓటమిపై సమీక్షలు మొదలు పెట్టింది. వైసీపీకి ఊహించని భారీ మెజార్టీ సీట్లు దక్కడం టీడీపీకి మాత్రం 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంత మంది ఎమ్మెల్యేలు...

విశాల్‌పై వ‌ర్మ‌ల‌క్ష్మి ఘాటు వ్యాఖ్య‌లు

హీరో, న‌డిగ‌ర్ సంఘం అధ్య‌క్షుడు విశాల్‌పై వ‌ర‌లక్ష్మి శ‌ర‌త్‌కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. అందుకు త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌ను వేదిక‌గా చేసుకున్నారామె.

విజ‌య‌వాడ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా: రాజ్ త‌రుణ్

రీసెంట్‌గా సోష‌ల్ మీడియా చాట్‌లో తాను ప్రేమ వివాహం చేసుకుంటున్నాన‌ని, త్వ‌ర‌లోనే త‌న పెళ్లి క‌బురు చెబుతాన‌ని హీరో రాజ్‌త‌రుణ్ తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే.

సూప‌ర్‌స్టార్‌తో న‌టించాల‌నుందంటున్న హాలీవుడ్ యాక్ట‌ర్‌

ఇటీవ‌ల మ‌హ‌ర్షి విడుద‌లైన‌ప్పుడు ఆ సినిమాను ఆకాశానికెత్తేస్తూ.. మహేష్‌, వంశీ పైడిప‌ల్లి అమెరికా వ‌స్తే త‌న‌ను క‌ల‌వాలంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేశారు హాలీవుడ్ యాక్ట‌ర్ బిల్ డ్యూక్‌.