close
Choose your channels

త‌మిళ నిర్మాత‌గా మారుతున్న రానా

Tuesday, July 16, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

త‌మిళ నిర్మాత‌గా మారుతున్న రానా

రానా ఇప్పుడు త‌మిళంలో నిర్మాత‌గా మారుతున్నారు. తెలుగులో మంచి విజ‌యాన్ని సాధించిన `జెర్సీ`ని ఆయ‌న త‌మిళంలోకి తీసుకెళ్తున్నారు. త‌మిళ క‌థానాయ‌కుడు విష్ణు విశాల్‌కు రానాకు మంచి ఫ్రెండ్‌షిప్ ఉంద‌న్న సంగ‌తి తెలిసిందే. విష్ణు విశాల్ కూడా గ‌తంలో `జీవా` అని క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ సినిమా చేశారు. అందుకే ఆయ‌న‌యితే `జెర్సీ` క‌థ‌కు చ‌క్క‌గా సూట్ అవుతార‌ని భావిస్తున్నారు రానా.

త‌మిళంలో సోలోగా కాకుండా, ఓ పెద్ద నిర్మాణ సంస్థ‌తో క‌లిసి ఈ సినిమాను నిర్మించ‌నున్నారు. త‌మిళంలో ఏస్ డైర‌క్ట‌ర్ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తెలుగులో నాని హీరోగా న‌టించిన ఈ సినిమాను గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. తండ్రీ, కొడుకుల మ‌ధ్య స్ట్రాంగ్ ఎమోష‌న్‌ని చెప్పే సినిమా ఇది. త్వ‌ర‌లోనే ఈ త‌మిళ వెర్ష‌న్‌కు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.