అనగనగా ఓ ప్రేమకథ టీజర్ రిలీజ్ చేసిన ప్రముఖ హీరో 'రాణా'

  • IndiaGlitz, [Saturday,September 22 2018]

విరాజ్.జె .అశ్విన్ హీరో గా పరిచయం అవుతూ అనగనగా ఓ ప్రేమకథ'' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి విదితమే. ప్రముఖ దర్శకులు ఎన్. శంకర్ గారి వద్ద అసోసియేట్ గా పనిచేసిన టి.ప్రతాప్ గారు ఈ చిత్రం ద్వారా నూతన దర్శకునిగా పరిచయం అవుతున్నారు.

అలాగే ఈ చిత్రానికి హీరో గా ప్రముఖ ఎడిటర్ మార్తాండ్.కె . వెంకటేష్ గారి మేనల్లుడు విరాజ్ జె అశ్విన్ ను పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రానికి హీరోయిన్ లుగా రిద్ధి కుమార్ మరియు రాధా బంగారు పరిచయమవుతున్నారు

ప్రముఖ హీరో రాణా దగ్గుబాటి ఈ సినిమా టీజర్ ను ఈ రోజు తన సోషల్ మీడియా ఖాతా ఫేస్ బుక్ ద్వారా విడుదల చేసి చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు.

చిన్న సినిమాలను ప్రోత్సహించడంలో రానా ఎప్పుడూ ముందుంటారు. ఇటీవలే కేరాఫ్ కంచరపాలెం సినిమాను కూడా తన ప్రొడక్షన్లో నిర్మించగా..ఆ సినిమాకు ఎంత మంచి పేరొచ్చిందో చూశాం. ఇప్పుడు ఈ సినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేసి మరోసారి చిన్న సినిమాలపై తనకున్న నమ్మకాన్ని చూపించారు. ఇటీవలే ఈసినిమా కు సంబంధించి ఫస్ట్ లుక్ ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ చేశారు.

ప్రముఖ నిర్మాత డి వి ఎస్ రాజు గారి అల్లుడు కె. ఎల్.ఎన్ రాజు గారు గత ౩౦ సంవత్సరాలుగా సినిమా రంగంలో ప్రముఖ ఫైనాన్షియర్ గా పేరుపొంది ఉన్నారు. చాలా రోజుల తర్వాత నిర్మాత గా థౌజండ్ లైట్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్యానర్ ను స్థాపించి ఈ ‘అనగనగా ఓ ప్రేమకథ’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'రాణా' తమ చిత్రం టీజర్ ను విడుదల చేయటం పట్ల చిత్ర నిర్మాత సంతోషాన్ని వ్యక్తం చేసి కృతఙ్ఞతలు తెలిపారు. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపు కుంటోంది. అక్టోబర్ నెలలో విడుదల చేయటానికి సిద్ధం చేస్తున్నాము అని తెలిపారు.

దర్శకుడు ప్రతాప్ మాట్లాడుతూ.'రాణా' గారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈ చిత్రం టీజర్చా ను విడుదల చేయటం చాలా ఆనందంగా ఉంది అన్నారు.

హీరో విరాజ్ జె అశ్విన్ మాట్లాడుతూ 'రాణా' గారు నా ఈ తొలి చిత్రం టీజర్ ను తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేయటం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు.

ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు (తిళ్ళు) తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, పాటలు:శ్రీమణి, కెమెరా: ఎదురొలు రాజు, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్: రామాంజనేయులు, నృత్యాలు: అనీష్, పోరాటాలు:రామకృష్ణ నిర్మాత: కె.ఎల్.ఎన్.రాజు కధ,స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం: ప్రతాప్ తాతంశెట్టి

More News

సెప్టెంబ‌ర్ 28న నాట‌కం విడుద‌ల‌.. 

నాట‌కం సినిమా సెప్టెంబ‌ర్ 28న విడుద‌ల కానుంది. ఆశిష్ గాంధీ, ఆశిమా నెర్వ‌ల్ జంట‌గా న‌టించిన ఈ చిత్రాన్ని కళ్యాణ్ జీ గోగ‌న తెర‌కెక్కించారు.

అక్టోబ‌ర్ 5న విజ‌య్ దేవ‌ర‌కొండ నోటా విడుద‌ల‌..

నోటా విడుద‌ల తేదీ క‌న్ఫ‌ర్మ్ అయింది. అక్టోబ‌ర్ 5న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌త్య‌రాజ్, నాజ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న

థాయ్‌లో మ‌హేశ్‌

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ఇప్పుడు 'మ‌హ‌ర్షి' సినిమాతో బిజీగా ఉన్నాడు. అక్టోబ‌ర్‌లో యు.ఎస్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.

ర‌వితేజ చిత్రంలో న‌భా

తొలి తెలుగు చిత్రం 'న‌న్నుదోచుకుందువ‌టే'తో ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకున్న హీరోయిన్ న‌భా న‌టేశ్‌.

న‌వంబ‌ర్‌లో నాగ్ చిత్రం!!

కింగ్ నాగార్జున 'ఆఫీస‌ర్' ఇచ్చిన షాక్  త‌ర్వాత మ‌రే చిత్రంలోన‌టించ‌డం లేదు. అయితే నాగార్జున కోసం రెండు స్క్రిప్ట్స్‌రెడీ అవుతున్నాయి.