వెంకీ చిత్రంలో రానా, నాగచైతన్య?

  • IndiaGlitz, [Thursday,November 16 2017]

గురు చిత్రం త‌రువాత కొన్నాళ్ల పాటు విరామం తీసుకున్న సీనియ‌ర్ క‌థానాయ‌కుడు వెంక‌టేష్‌.. త‌న త‌దుప‌రి సినిమాని సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు తేజతో చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్ 13న ప్రారంభం కానున్న ఈ సినిమాలో కేర‌ళ‌కుట్టి నిత్యా మేన‌న్ హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశ‌ముంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆటా నాదే వేటా నాదే అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న ఈ సినిమాలో వెంక‌టేష్ ప్రొఫెస‌ర్ పాత్ర‌లో సంద‌డి చేయ‌నున్నార‌ని మీడియాలో క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో రెండు అతిథి పాత్ర‌లు ఉన్నాయ‌ని.. వాటిని యువ క‌థానాయ‌కులు రానా, నాగ‌చైత‌న్య చేయ‌బోతున్నార‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. గ‌తంలో రానా క‌థానాయ‌కుడిగా న‌టించిన కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్‌లోనూ.. నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా న‌టించిన ప్రేమ‌మ్‌లోనూ వెంకీ అతిథి పాత్ర‌లో త‌ళుక్కున మెరిసారు.

ఇప్పుడు వెంక‌టేష్ చేయ‌బోయే కొత్త చిత్రంలో ఈ ఇద్ద‌రు అతిథి పాత్ర‌ల్లో న‌టించ‌నుండ‌డం విశేషంగానే చెప్పాలి.