బాబాయి కేసును రీ ఓపెన్ చేయనున్న రానా?

  • IndiaGlitz, [Tuesday,March 09 2021]

‘దృశ్యం’ సినిమా సింపుల్‌గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. మలయాళం రీమేక్ అయిన ఈ సినిమా.. తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కింది. థ్రిల్లర్ జోనర్‌లో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే మలయాళం ఈ సినిమాకు సీక్వెల్ కూడా వచ్చింది. ఒక సక్సెస్ సాధించిన చిత్రానికి సీక్వెల్ అంటే మామూలు విషయం కాదు.. ఏమాత్రం అటు ఇటు అయినా సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుంది. కానీ ఈ చిత్రానికి సంబంధించిన సీక్వెల్‌ను దర్శకుడు జీతూ జోసెఫ్‌ టాకిల్ చేసిన తీరు అద్భుతం.

‘దృశ్యం’ సినిమాకు మించి ‘దృశ్యం 2’ ఆకట్టుకుందనడంలో సందేహం లేదు. బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. దీంతో ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్‌కు సిద్ధమైంది. విక్టరీ వెంకటేష్, మీనా జంటగా ఈ సీక్వెల్ కూడా రూపొందుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో బాబాయి, అబ్బాయి కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మలయాళంలో ఈ చిత్రంలో సురేష్ గోపి నటించిన కొత్త ఇన్‌స్పెక్టర్‌ పాత్రలో రానా నటించబోతున్నాడని టాలీవుడ్ టాక్.

‘దృశ్యం’ సినిమా చూసిన వారెవ్వరూ దాని కథను మరచిపోలేరు. ఈ సినిమాలో ఓ యువకుడు వెంకటేష్ కూతురిని వేధించి, ఆయన చేతిలోనే హత్యకు గురవుతాడు. ఆ హత్య చేసింది ఎవరో పోలీసులు తెలుసుకోలేకపోతారు. చివరికి కేసు క్లోజ్‌ అయిపోతుంది. ‘దృశ్యం 2’లో కొత్త ఇన్‌స్పెక్టర్‌ చార్జ్‌ తీసుకున్నాక కేసుని రీ ఓపెన్‌ చేస్తారు. మళ్లీ అమ్మాయి తండ్రి రాంబాబు కేసు నుంచి తప్పించుకోవడానికి ప్లాన్‌లు మొదలుపెడతాడు. రాంబాబు పాత్రలో వెంకటేశ్ తిరిగి మెప్పించనున్నారు. ఈ సీక్వెల్‌కు సైతం జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహించనున్నారు.

More News

ఏపీలో ఎన్నికలకు ముందు కేంద్రం కీలక ప్రకటన.. కష్టాల్లో వైసీపీ!

విశాఖ ఉక్కు కర్మాగారం రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) ప్రైవేటీకరణ అంశంపై వెనక్కి తగ్గేది లేదని వందకు వంద శాతం అమ్మి తీరుతామని పార్లమెంట్ వేదికగా కేంద్రం తేల్చి చెప్పింది.

ఐ ఎమ్ డి బి లో టాప్ స్కోర్ లో నిలిచిన షాదీ ముబారక్

ఈ శుక్రవారం రిలీజ్ అయిన షాదీ ముబారక్ ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో 9.1 రేటింగ్ తో టాప్ పోజీషన్ లో నిలిచింది. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా సాగే ఈ సినిమా కి ప్రేక్షకులు ఆదరణ లభించింది.

తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా 'దేత్తడి' హారిక

బిగ్‌బాస్‌ ఫేం.. ‘దేత్తడి’ హారిక బంపర్‌ ఆఫర్‌ అందుకున్నారు. తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా హారిక నియమితులయ్యారు. బిగ్‌బాస్‌తో హారిక చాలా ఫేమస్ అయ్యారు.

సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో భారీ మోసం

ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నా.. సైబర్ నేరగాళ్లు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. రకరకాల దారుల్లో వస్తూ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ

సిద్ శ్రీరామ్‌కు పబ్‌లో ఘోర అవమానం!

‘ఇంకేం ఇంకేం కావాలే’ అంటూ యూత్ గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న సింగర్ సిద్ శ్రీరాం. వైవిద్యమైన గాత్రంతో టాలీవుడ్‌లో తనకంటూ మంచి స్థానం ఏర్పాటు చేసుకున్నారు.