కన్ఫ్యూజన్ ‘రంగ్ దే’ టీమ్

  • IndiaGlitz, [Monday,September 07 2020]

యువ క‌థానాయ‌కుడు నితిన్, కీర్తి సురేశ్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘రంగ్ దే’. ఈ ఏడాది భీష్మ‌తో హిట్ కొట్టిన నితిన్ ఈ వేస‌విలో ‘రంగ్ దే’ చిత్రంతో సంద‌డి చేయాల‌నుకున్నారు. కానీ కోవిడ్ 19 ఎఫెక్ట్ కార‌ణంగా ఈ సినిమా తుది ద‌శ షూటింగ్ ఆగింది. థియేట‌ర్స్ మూత ప‌డ్డాయి. థియేట‌ర్స్ ఓపెన్ అయ్యే విష‌యంలో సెప్టెంబర్ 8న ఓ క్లారిటీ రానుంది. అయితే ఈ నెల ద్వితీయార్థంలోనే సినిమా షూటింగ్‌ను షురూ చేసి మిగిలిన కొద్ది భాగాన్ని పూర్తి చేసి వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. అయితే ఇప్పుడు ఓ ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డైరెక్ట‌ర్ రిలీజ్ చేస్తే సినిమా బ‌డ్జెట్‌పై ఇర‌వై శాతం ఎక్కువ అమౌంటే ఇస్తామ‌ని చెబుతుంద‌ట‌. ఇప్పుడు థియేట‌ర్స్‌కు వెళితే ఆడియెన్స్‌ ముందులా థియేట‌ర్స్‌కు వ‌స్తారో, రారో అనే అనుమానం ఉంది. మ‌రి థియేట‌ర్స్‌కే వెళ్లాలా? లేక ఓటీటీ ఆఫ‌ర్‌కు ఓకే అనాలా? అని నిర్మాత‌లు ఆలోచ‌న‌లో పడ్డార‌ట‌.

‘రంగ్‌దే’ పూర్తి కాగానే అంధాదున్ రీమేక్‌తో పాటు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ థ్రిల్ల‌ర్ మూవీలోనూ నితిన్ న‌టించాల్సి ఉంది. ఇవి కాకుండా కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో ‘ప‌వ‌ర్ పేట‌’ చిత్రంలోనూ నితిన్ హీరోగా న‌టించాల్సి ఉంది. ఈ సినిమా రెండు భాగాలుగా తెర‌కెక్క‌నుంది. ఈ సినిమాలోనూ కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని స‌మాచారం.

More News

శ్రీమంతుడుగా మారిన‌ ప్ర‌భాస్‌

శ్రీమంతుడుగా ప్ర‌భాస్‌..! అదేంటి శ్రీమంతుడు మ‌హేశ్ క‌దా!! అనే సందేహం చాలా మందికి వ‌చ్చుండొచ్చు.

సోనూసూద్‌పై తీవ్ర స్థాయిలో రెచ్చిపోయిన పోసాని..

కరోనా మహమ్మారి కారణంగా ముఖ్యంగా ప్రజానీకానికి ఎవరేంటనేది తెలిసి వచ్చింది. రీల్ లైఫ్ హీరోలు కాస్తా..

సత్యదేవ్‌ కొత్త చిత్రం 'తిమ్మరుసు'

విలక్షణమైన కథా చిత్రాలు, పాత్రలతో నటుడిగా ప్రేక్షకాభిమానుల ఆదరాభిమానాలు పొందుతున్న సత్యదేవ్‌ హీరోగా కొత్త చిత్రం 'తిమ్మరుసు'.

సోనూసూద్ కంటే వైఎస్ భారతి లక్ష రెట్లు బెటర్: పోసాని

కరోనా మహమ్మారి రీల్ లైఫ్ విలన్ కాస్తా.. రియల్ లైఫ్ హీరోని చేసింది.

కంగనకు వై ప్లస్ కేటగిరి భద్రతను కల్పించిన కేంద్రం!

బాలీవుడ్‌లో ఏదనిపిస్తే అది వెనుకాడకుండా మాట్లాడుతూ.. స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకుంది.