'రంగ‌స్థ‌లం' కొత్త డేట్‌..

  • IndiaGlitz, [Saturday,October 21 2017]

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, క్రియేటివ్ జీనియ‌స్ సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న తొలి చిత్రం 'రంగ‌స్థ‌లం'. అక్కినేని స‌మంత క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే ఓ ప్ర‌త్యేక గీతంలో ఆడిపాడ‌నుంది. సుకుమార్ ఆస్థాన సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేసింది.

అయితే అదే స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ 25వ చిత్రం కూడా విడుద‌ల కానుండ‌డంతో.. రంగ‌స్థ‌లం విడుద‌ల వాయిదా ప‌డింది. కాగా, తాజాగా వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం మార్చి 30న వేస‌వి కానుక‌గా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకొచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది. జ‌గ‌ప‌తిబాబు, ఆది పినిశెట్టి, అన‌సూయ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి ప్ర‌ముఖ ఛాయాగ్రాహ‌కుడు ర‌త్న‌వేలు ఫొటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ధృవ త‌రువాత రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగానూ.. నాన్న‌కు ప్రేమ‌తో త‌రువాత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలోనూ వ‌స్తున్న సినిమా కావ‌డంతో రంగ‌స్థ‌లంపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.

More News

నవంబర్‌ 17న 'ఖాకి' భారీ రిలీజ్

"మనం చెడ్డవాళ్ల నుంచి మంచివాళ్లను కాపాడే పోలీస్‌ ఉద్యోగం చేయడం లేదు. మంచి వాళ్లనుంచి చెడ్డవాళ్లను కాపాడే చెంచా ఉద్యోగం చేస్తున్నాం.. సార్‌" అని ఓ పోలీసాఫీసర్‌ తన పైఅధికారిని అడుగుతున్న ప్రశ్న ఇది. ‘‘పవర్‌లో ఉన్నోడి ప్రాణానికిచ్చే విలువ.. పబ్లిక్‌ ప్రాణాలకు ఎందుకివ్వరు సార్‌’ ఇది అతని ఆవేదన. దీన్నిబట్టి అతనెంత సిన్సియర్‌గా డ్యూట

వైరల్ అవుతోన్న కోహ్లీ-అనుష్క వీడియో

‘కోహ్లీ-అనుష్క’ కలిసి నటించిన ఓ వీడియో యాడ్ ఇప్పుడు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది.

'మ‌నం' ముందుగా...

అక్కినేని ఫ్యామిలీ చిత్రం 'మ‌నం' వారికి మ‌ర‌చిపోలేని గుర్తు. ఎందుక‌నో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సినిమా పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కావ‌డ‌మే కాదు. అక్కినేని మూడు త‌రాల న‌టులు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, అక్కినేని నాగార్జున‌, చైత‌న్య, అఖిల్ అంద‌రూ క‌లిసి న‌టించారు.

కొత్త‌గా పూరి...

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌కు ఇప్పుడు స‌రైన హిట్ లేదు. ఎలాగైనా ఓ మంచి హిట్ కొట్టాల‌ని ఆశ‌గా వెయిట్ చేస్తున్నాడు. అందులో భాగంగా త‌న త‌న‌యుడు ఆకాష్ పూరితో త‌న స్వంత నిర్మాణంలో 'మెహ‌బూబా' అనే సినిమాను స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఆ సినిమాను దిల్‌రాజు చేయ‌డం లేదా?

1996లో క‌మ‌ల్‌హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన భార‌తీయుడు చిత్రం ఎంత‌టి సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిందో తెలిసిందే. 21 ఏళ్ల‌కు ఈ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంద‌ని అధికార‌క వార్త‌లు వినిపించాయి.