చివరి అంకంలో 'రంగస్థలం'

  • IndiaGlitz, [Friday,January 19 2018]

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యూత్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం రంగస్థలం'. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథని చాలా వరకు గోదావరి నదీ తీర ప్రాంతాల్లోనే చిత్రీకరణ జరిపారు. హైదరాబాదులో వేసిన సెట్ లో మరికొంత పార్ట్ షూటింగ్ జరుపుకుందీ చిత్రం. ఇప్పుడు షూటింగ్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో.. కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి మళ్ళీ గోదావరి ప్రాంతానికి చేరుకుంది చిత్ర యూనిట్.

ఈ రోజు నుంచి రామ్ చరణ్, సమంతల మధ్య కొన్ని ప్రీ-క్లైమాక్స్ సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. వీటితో ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకోనుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమౌతున్న ఈ ఫిలిం టీజరుని...జ‌న‌వ‌రి 24న‌ విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అలాగే సినిమాని మార్చి 30న వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. జ‌గ‌ప‌తిబాబు, అన‌సూయ‌, ఆది పినిశెట్టి త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషించారు.

More News

బాలకృష్ణకి ఆ పాత్ర‌లో న‌టించాల‌నుందంట‌

'జై సింహా' సినిమాతో మ‌రోసారి 'సంక్రాంతి క‌థానాయ‌కుడు' అనిపించుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఈ చిత్రంలోని ఓ స‌న్నివేశం కోసం.. బ్రాహ్మణుల గొప్పదనం గురించి చెప్పిన బాలయ్యను బ్రాహ్మణ సంఘాలు అభినందిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. హైదరాబాదులో జరిగిన చిత్ర విజయోత్సవ సభ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ, "ఎన్టీఆర్ కుమారుడిగా పుట్టడం నా పూర్వజన్

వెంకీ సినిమాకి ముహుర్తం కుదిరింది

తాజాగా విడుద‌లైన‌ అజ్ఞాత‌వాసి సినిమాలో అతిథి పాత్ర‌లో సంద‌డి చేశారు సీనియ‌ర్ క‌థానాయ‌కుడు విక్టరీ వెంకటేష్. ఇప్పుడు ఆయ‌న క‌థానాయ‌కుడిగా..  ఓ కొత్త చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. దీనికి సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు తేజ దర్శకత్వం వహించ‌నున్నారు.

'బగ్గిడి గోపాల్' షూటింగ్ ప్రారంభం!

బగ్గిడి ఆర్ట్ మూవీస్ పతాకంపై బగ్గిడి గోపాల్ ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మిస్తోన్న బయోపిక్ 'బగ్గిడి గోపాల్'.

'టిక్ టిక్ టిక్' ట్రైలర్ ను విడుదల చేసిన సాయిధరమ్ తేజ్

జయం రవి,నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్లుగా చదలవాడ బ్రదర్స్ సమర్పణలో