నెల్లూరు ఘటనపై అందరూ గళం విప్పాలి : రష్మి

  • IndiaGlitz, [Monday,May 18 2020]

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో పోలీసుల తీరు వివాదాస్పదమైన విషయం విదితమే. జిల్లాలోని ఆత్మకూరు ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ చేస్తున్న గదిలో చిన్నారి (06)తో గదిని తుడిపించారని ఆరోపణలు వచ్చాయి. స్కూల్ వాచ్‌మెన్‌ కుమార్తెతో గదిని తుడిపించారు.. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ వ్యవహారం అటు సోషల్ మీడియాలో.. ఇటు మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. మరోవైపు.. పోలీస్ కానిస్టేబుల్ దగ్గరుండి గదిని శుభ్రం చేయించారని.. పిల్లలతో పనులు చేయించకూడదని తెలిసీ దారుణంగా ప్రవర్తించారని బాలల హక్కుల సంఘం మండిపడింది..

అందరూ గళం విప్పాలి..

ఈ ఘటనపై యాంకర్ రష్మి ట్విట్టర్ వేదికగా స్పందించింది. ఈ ఘటనను ఒక సాధారణ అంశంగా చూడకూడదని రష్మి చెప్పింది. ఇలాంటి ఘటనలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గళాన్ని వినిపించాలని కోరింది. రష్మి ట్వీట్‌కు పలువురు నెటిజన్లు స్పందించి మద్దతిచ్చారు. కాగా సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండే రష్మి సమాజంలో జరిగే విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది.

డీజీపీ రియాక్షన్..

ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై ఏపీ డీజీపీ దృష్టికి తెచ్చి చర్యలు చేపట్టాలని కోరింది. దీనిపై డీజీపీ గౌతమ్ సవాంగ్ ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో గది శుభ్రం చేసే సమయంలో పోలీసు హెడ్‌ కానిస్టేబుళ్లు ప్రేక్షక పాత్ర పోషించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారాయన. ఇటువంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని.. అదే విధంగా ఇద్దరు కానిస్టేబుళ్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నెల్లూరు జిల్లా ఎస్పీని సవాంగ్ ఆదేశించారు. ఇప్పటికే పలువురు ఈ ఘటనపై స్పందించి తీవ్రంగా తప్పుబట్టారు.

More News

పూరి త‌న‌యుడిని ప‌ట్టించుకుంటారా!!

పూరి త‌న‌యుడు ఆకాశ్ పూరి బాల న‌టుడిగా పలు చిత్రాల్లో న‌టించాడు. త‌ర్వాత హీరోగా కూడా మెహ‌బూబా చిత్రంతో ప‌రిచ‌యం అయ్యాడు. ఆ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది.

ఇక‌పై న‌టించ‌ను: ఛార్మి

హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఛార్మి అగ్ర క‌థానాయ‌కులంద‌రితోనూ న‌టించింది. అయితే క్ర‌మంగా నిర్మాత‌గా మారారు. పూరీ జ‌గ‌న్నాథ్‌తో క‌లిసి ఈమె సినిమాలు నిర్మించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు.

క్రేజీ కాంబినేష‌న్ మ‌రోసారి!!

మిర‌ప‌కాయ్‌తో సూప‌ర్‌డూప‌ర్ హిట్.. గ‌బ్బ‌ర్‌సింగ్‌తో ఇండ‌స్ట్రీ హిట్ అందుకున్న డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్‌. 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్‌తో రామ్ ఆచంట‌

అదే మీరిచ్చే విలువైన బ‌హుమ‌తి..అభిమానులకు తార‌క్‌ రిక్వెస్ట్

తార‌క్ అభిమానులు ఆయ‌న పుట్టిన‌రోజున రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ట్రిపుల్ ఆర్ సినిమాకు సంబంధించిన వీడియో ప్రోమోను చూడటానికి ఆతృత‌గా ఎదురుచూడ‌సాగారు. అయితే రాజ‌మౌళి

కాలం, దేశం మారినా మేం మారలేదంటోన్న మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి లాక్‌డౌన్ స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయ‌న పోస్ట్‌లు అంద‌రిలో ఆస‌క్తిని పెంచుతున్నాయి.