అంత‌యితేనే ర‌ష్మిక ఓకే చెప్పిందా..?

  • IndiaGlitz, [Wednesday,October 28 2020]

క‌రోనా టైమ్‌లో సినీ ఇండ‌స్ట్రీ కుదేలైంది. నిర్మాత‌లంద‌రూ ప్రొడ‌క్ష‌న్ కాస్ట్‌ను త‌గ్గించుకునే ప‌నిలో భాగంగా, న‌టీన‌టులు, ఆర్టిస్టులంద‌రూ వారి రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌. కానీ బ‌య‌ట ప‌రిస్థితులు అలాఏం క‌న‌ప‌డ‌టం లేదు. అందుకు రీసెంట్ ఎగ్జాంపుల్ ర‌ష్మిక మంద‌న్న‌. ప్ర‌స్తుతం స్టార్ హీరోయిన్ లిస్టులో చేరిన ఈ క‌న్న‌డ బ్యూటీ.. రీసెంట్‌గా ఓ సినిమా కోసం భారీ రెమ్యున‌రేష‌న్‌ను డిమాండ్ చేసింద‌ట‌.

వివ‌రాల్లోకెళ్తే.. శ‌ర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న చిత్రం ‘ఆడాళ్లు మీకు జోహార్లు’. ఇందులో ముందుగా సాయిప‌ల్ల‌విని హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ చివ‌రి నిమిషంలో ర‌ష్మిక హీరోయిన్‌గా ఓకే అయ్యింది. ఈ సినిమాలో న‌టించ‌డానికి ఈ అమ్మ‌డు రెండు కోట్లు డిమాండ్ చేసింద‌ట‌. చ‌ర్చ‌ల అనంత‌రం పాతిక ల‌క్ష‌ల డిస్కాంట్‌ను ఇచ్చి కోటి ముప్పాతిక ల‌క్ష‌ల‌కు సినిమా చేయ‌డానికి ఓకే చెప్పింద‌ట‌. ఇక ర‌ష్మిక‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్మాత ర‌ష్మిక అడిగినంత ఇవ్వ‌డానికి ఓకే చెప్పిన త‌ర్వాత ఆమె ప్రాజెక్ట్‌ను ఓకే చేసింద‌ట‌. తెలుగులో అల్లు అర్జున్‌తో ‘పుష్ప’ సినిమాలోనూ రష్మిక నటిస్తుంది. అలాగే కార్తి ‘సుల్తాన్’లో హీరోయిన్‌గా నటించింది.

More News

‘లూసిఫ‌ర్‌’లో ‘చిరు’ మార్పులు

ప్ర‌స్తుతం త‌న 152వ చిత్రం ‘ఆచార్య‌’ను రీస్టార్ట్ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి ప్లాన్స్ చేసుకుంటున్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోందీ ఈ సినిమా.

చిరంజీవి సినిమాలో కీర్తి సురేష్.. ఏ పాత్రలోనంటే ?

మెగాస్టార్ చిరంజీవి అప్‌కమింగ్ మూవీలో హీరోయిన్ కీర్తి సురేష్ ఛాన్స్ కొట్టేసింది. చిరు హీరోగా తమిళ్ బ్లాక్ బస్టర్ ‘వేదాళం’ను డైరెక్టర్ మెహర్ రమేష్ రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే.

‘పుష్ప’ షెడ్యూల్ ప్లానింగ్‌లో చిన్న మార్పు

స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో ‘ఆర్య‌, ఆర్య 2’ త‌ర్వాత రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప‌’.

కృష్ణ-విజయనిర్మల కుటుంబ సభ్యుడు శరణ్ హీరోగా, రామచంద్ర వట్టికూటి దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ప్రారంభమైంది

పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ - అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కిన విజయనిర్మల కుటుంబం నుంచి మరో వారసుడు వస్తున్నారు.

ఓ చిన్నారి కోసం ట్రైన్ ఏకంగా 240 కి.మీ ఆగకుండా ప్రయాణించింది..

కొన్నిసార్లు ప్రజల రక్షణ కోసం ప్రభుత్వ యంత్రాంగం చేసే పనులు చాలా ఆసక్తికరంగానూ.. చరిత్రలో నిలిచిపోయేవిగానూ ఉంటాయి.