మానవత్వం ఎక్కడుంది..? రష్మిక హార్ట్ టచింగ్ ట్వీట్

  • IndiaGlitz, [Saturday,April 20 2019]

'ఛలో' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా అతి తక్కువ సమయంలోనే తానేంటో నిరూపించుకుంది. స్టార్ హీరోల సరసన నటించాలంటూ ఈమెకోసం దర్శకులు, నిర్మాతలు క్యూ కడుతున్నారంటే రష్మిక రేంజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు.! ముఖ్యంగా విజయ్ దేవరకొండ సరసన నటించిన 'గీత గోవిందం'తో టాలీవుడ్‌లో బాగా హైలైట్ అయ్యింది.

అలా తెలుగు సినీ ఇండస్ట్రీలో అనతికాలంలోనే రష్మిక టాప్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. రష్మిక నటనకు ఎంతోమంది అమ్మాయిలు, అబ్బాయిలు ఫిదా అయిపోయి అభిమానులుగా మారిపోయారు. అటు సినిమాలతో బిజీబిజీగా ఉన్నప్పటికీ అభిమానులు, సినీ ప్రియులతో రష్మిక నిత్యం సోషల్ మీడియాలో టచ్‌లో ఉంటూ వస్తోంది.

తాజాగా.. ట్విట్టర్ వేదికగా రష్మిక హార్ట్ టచింగ్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌‌ చూసిన నెటిజన్లు ఒకింత తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఇటీవల రాయచూర్ అడవుల్లో ఇంజనీర్ విద్యార్థినిపై అత్యాచారం చేసి పాశవికంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నెట్టింట్ట పెద్ద ఎత్తున రగడ జరుగుతోంది. ఈ అమానుష ఘటనపై సామాన్యులు మొదలుకుని సెలబ్రిటీల వరకూ అందరూ స్పందిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా రష్మిక కూడా రియాక్ట్ అయ్యింది.

రష్మిక ట్వీట్ సారాంశం...

అసలు మనుషుల్లో మానవత్వం ఎక్కడుంది..? రాయచూర్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని మధుపై పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన నా హృదయాన్ని కలచివేసింది (గుండెను బద్దలు చేసింది). ఇలాంటి ఘటనలు ఇంకా ఎంత మంది ఎదుర్కోవాలి?. మధుకు న్యాయం జరగాలి.. అంతేకాదు ఇదే చివరి సంఘటన కావాలని ఆశిస్తున్నాను అని రష్మిక తీవ్ర ఆవేదనతో ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు పలువురు నెటిజన్లు రియాక్ట్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా ఇది చాలా బాధాకారమైన ఘటన మేడమ్.. సారీ నేను హెల్ప్‌లెస్ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు.

More News

స్టార్ డైరెక్టర్‌ పై అనిరుధ్ సంచలన ట్వీట్..!!

నేచురల్ స్టార్ నాని,  శ్రద్దా శ్రీనాథ్‌ నటీనటులుగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్‌ స్పోర్ట్స్ డ్రామా 'జెర్సీ'.

అప్పుడు స్నేహం.. ఇప్పుడు వైరం

టాలీవుడ్ స్టార్ హీరోల్లో నాగార్జున ఒక‌రు. నాగ్ కెరీర్ ప్రారంభంలో విజ‌య‌శాంతితో క‌లిసి ప‌లు సినిమాల్లో న‌టించారు.

ఎక్స్‌పెరిమెంట్ రాజా!

క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌కే పెద్ద పీట వేసే హీరోల్లో ర‌వితేజ ముందుంటారు. సినిమా క‌మ‌ర్షియ‌లే అయినా పాత్రల ప‌రంగా కాస్త‌..

22 కోట్ల రూపాయ‌ల స‌న్నివేశం

ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌, రాంచ‌ర‌ణ్ న‌టిస్తోన్న దేశ‌భ‌క్తి చిత్రం `RRR`. మూడో షెడ్యూల్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది.

నెంబ‌ర్ మారుతుందా?

అల్లు అర్జున్ ఇప్పుడు ఇద్ద‌రు ద‌ర్శ‌కుల‌తో హ్యాట్రిక్ సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒక‌రు త్రివిక్ర‌మ్‌.