ప్రియమైన వారి నుంచి ఉంగరం అందిందంటూ రష్మిక పోస్ట్..

  • IndiaGlitz, [Tuesday,March 30 2021]

నటి రష్మిక తాజాగా ఓ బహుమతి అందుకుంది. అది ఎవరి నుంచి అనేది తెలియదు కానీ ఆ గిఫ్ట్‌ని చూశాక ఆమె ఆనందానికి అవధుల్లేవని తెలుస్తోంది. అది మరేంటో కాదు.. రష్మికకు గిఫ్ట్‌గా ఓ రింగ్ వచ్చింది. వెంటనే దానిని చేతికి వేలికి తొడిగి ఆ వేలిని ఫోటో తీసి దానిని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. దీనికి ఒక పోస్టును కూడా జత చేసింది. అయితే ఆ ఉంగరం తనకు అత్యంత ప్రియమైన వ్యక్తుల నుంచి అందిందని రష్మిక వెల్లడించింది. దీంతో నెటిజన్లు ఆ ఉంగరం ఎవరిచ్చారా? అని ఆరా తీయడం మొదలు పెట్టారు.

‘‘ఇది నాకు ఎవరు పంపారో తెలుసు. దీన్ని నేను అందుకున్నా. నేను మీ సీక్రెట్ మెసేజ్‌ను చదివాను. నాకిది సరిగ్గా సరిపోయింది. ఇది నాకు బాగా నచ్చింది’’ అంటూ రష్మిక ఆ ఫొటోకి ఓ వ్యాఖ్యని కూడా జత చేసింది. దీంతో ఇప్పుడీ ఉంగరం కథ కాస్తా నెట్టింట వైరల్‌గా మారిపోయింది. ప్రస్తుతం రష్మిక టాలీవుడ్‌లో చాలా బిజీ హీరోయిన్‌గా కొనసాగుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసినప్పటి నుంచి స్టార్ హీరోలతో అవకాశాలు వస్తున్నాయి. అల్లు అర్జున్‌తో ‘పుష్ప సినిమా చేస్తున్న రష్మిక.. అటు తమిళంలోనూ ‘సుల్తాన్’ మూవీ చేస్తోంది.

More News

డ్రైవర్‌కు కరోనా.. మహేష్ ఫ్యామిలీ టెస్ట్ చేయించుకోగా..!

కరోనా సెకండ్ వేవ్ సూపర్ స్పీడ్‌తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

‘వకీల్ సాబ్’ ట్రైలర్‌ విడుదల సమయంలో ఫ్యాన్స్ బీభత్సం..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మూడేళ్ల గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’.

ఎట్టకేలకు కదిలిన నౌక

సూయెజ్‌ కాలువలో కూరుకుపోయిన రాకాసి నౌక ‘ఎవర్‌ గివెన్‌’ ఎట్టకేలకు కదిలింది. సుమారు ఆరు రోజులుగా పడుతున్న కష్టానికి సోమవారం ఫలితం లభించింది.

రవితేజ 'ఖిలాడి'కి ఊహించని షాక్...

‘క్రాక్’ సినిమాలో నటించి మంచి సక్సెస్ సాధించాడు హీరో రవితేజ. తన కమ్ బ్యాక్‌కు ఈ చిత్రం అద్భుతంగా తోడ్పడింది. ప్రస్తుతం ఇదే జోష్‌తో ‘ఖిలాడి’ సినిమాలో నటిస్తున్నాడు.

‘విరాటపర్వం’ : సాయిపల్లవి ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్

వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో నేషనల్ స్టార్ రానా దగ్గుబాటి, సెన్సేషనల్‌ బ్యూటీ సాయిప‌ల్ల‌వి జంట‌గా రూపొందుతోన్న చిత్రం 'విరాట‌ప‌ర్వం'.