తన పెట్ తో ముంబయిలో కొత్త ఇంటికి షిఫ్ట్ అయిన రష్మిక!

  • IndiaGlitz, [Wednesday,June 23 2021]

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన రష్మిక ఇక బాలీవుడ్ లో కూడా పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. బాలీవుడ్ పై ఫోకస్ పెట్టేందుకు ఆమె కొత్త జర్నీ ప్రారంభించింది. అదేంటంటే.. రష్మిక ఇటీవల ముంబయిలో అపార్ట్మెంట్ లో కొత్త ఇల్లు తీసుకుంది.

తాజాగా రక్ష్మిక ఆ ఇంటికి షిఫ్ట్ అయింది. ఈ సంగతిని రష్మిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో క్యూట్ పిక్ తో తెలిపింది. రష్మిక తన పెంపుడు కుక్క 'ఔరా'తో కలసి కొత్త ఇంటికి షిప్ట్ అయ్యిందట. సోఫాలో తన కుక్కతో ఉన్న టీజింగ్ పిక్ ని రష్మిక షేర్ చేసింది.

'డియర్ డైరీ.. ఈ రోజు చాలా జరిగింది. కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాం. షాపింగ్ చేసి చాలా వస్తువులు కొన్నాం. ఇంకా పూర్తి కాలేదు. బాగా అలసిపోయి సోఫాలో కూర్చుని నేను, ఔరా నిద్రపోతున్నాం' అని రష్మిక కామెంట్ పెట్టింది.

రష్మిక ఇటీవలే 'గుడ్ బై' చిత్ర షూటింగ్ కోసం ముంబయికి వచ్చింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తెలుగులో అల్లు అర్జున్ సరసన 'పుష్ప' చిత్రంలో నటిస్తోంది. రష్మిక చివరగా 'సుల్తాన్' చిత్రంలో మెరిసింది.

ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక తక్కువ టైంలోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. గీత గోవిందం, భీష్మ, సరిలేరు నీకెవ్వరు లాంటి విజయాలు ఆమె ఖాతాలో పడ్డాయి.

More News

షాకింగ్: రూ.150 కోట్ల డీల్ వదులుకున్న ప్రభాస్.. నో ఎందుకు చెప్పాడంటే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా క్రేజీ స్టార్. బాహుబలి చిత్రంతో ప్రభాస్ క్రేజ్ తారాస్థాయికి చేరింది.

తాప్సీ చిత్రం నుంచి దర్శకుడు అవుట్.. కారణం ఇదే!

ప్రస్తుతం వెండితెరపై క్రికెటర్ల బయోపిక్ చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి.

మహేష్ రిలీజ్ చేసిన 'హీరో' టీజర్.. కౌబాయ్, జోకర్ గెటప్పుల్లో అశోక్ గల్లా

సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా, మహేష్ మేనల్లుడిగా అశోక్ గల్లా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు.

హాట్ టాపిక్ గా మారిన రవితేజ రెమ్యునరేషన్

మాస్ మహారాజ్ రవితేజ 'క్రాక్' చిత్రంతో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన క్రాక్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి తొలి 'వీసీ'గా కరణం మల్లీశ్వరి!

తెలుగు తేజం కరణం మల్లీశ్వరి ఖాతాలో మరో ఘనత చేరింది. ఒలంపిక్స్ లో ఇండియా తరుపున మెడల్ సాధించిన తొలి మహిళ కరణం మల్లీశ్వరి.