అఖిల్తో రష్మిక
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని అఖిల్ హీరోగా నాలుగో చిత్రం త్వరలోనే సెట్స్కు వెళ్లనుంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. గీతాఆర్ట్స్ సినిమాను నిర్మించనుంది. అధికారిక సమాచారం రాలేదు కానీ.. ప్రీ ప్రొడక్షన్ పనులు అన్నీ పూర్తయ్యాయి.
ఈ సినిమా హీరోయిన్ విషయంలో యూనిట్ ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పలువురు హీరోయిన్స్ పేర్లు పరిశీలనలోకి వచ్చాయి.రీసెంట్గా బాలీవుడ్ భామ కియరా అద్వానిని హీరోయిన్గా తీసుకోవాలని అనుకున్నారు.
అయితే ఆమె డేట్స్ను అడ్జస్ట్ చేయలేనని చెప్పేసిందట. దాంతో ఇప్పుడు నిర్మాణ సంస్థ రష్మిక మందన్నాను హీరోయిన్గా తీసుకోవాలనుకుంటుందట. ఛలో, గీతా గోవిందం చిత్రాలతో రష్మికకు తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది. ఈమె ఇప్పుడు తెలుగులో డియర్ కామ్రేడ్లో నటిస్తోంది. ఈమెను హీరోయిన్గా తీసుకుంటే బావుంటుందనే భావనతో రష్మికతో సంప్రదింపులు జరుపుతుందట నిర్మాణ సంస్థ. అయితే చేతినిండా సినిమాలతో బిజి బిజీగా ఉన్న రష్మిక సినిమా చేయడానికి ఒప్పుకుంటుందో లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.